భారత్ నుంచి స్వదేశానికి చేరుకున్న దక్షిణాఫ్రికా క్రికెటర్లు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కరోనా వైరస్ (కొవిడ్-19) విజృంభిస్తుండటం వల్ల ఇటీవలె భారత్- దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ను తాత్కాలికంగా రద్దు చేశారు. అనంతరం మంగళవారం సఫారీలు తమ దేశానికి చేరుకున్నారు. అయితే 14 రోజుల వరకు వారంతా స్వీయ నిర్బంధంలో ఉంటారని ఆ జట్టు ప్రధాన వైద్యాధికారరి డాక్టర్ షుయబ్ మంజ్రా తెలిపారు.
" ఇతరులకు దూరంగా 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆటగాళ్లకు సూచించాం. కుటుంబాన్ని, బంధువులను, ఇతరులను రక్షించుకోవడానికి ఇదే సరైన మార్గమని భావిస్తున్నాం. ఆ సమయంలో ఆటగాళ్లకు కరోనా లక్షణాలు గుర్తించవచ్చు. ప్రయాణంలో కొందరు ఆటగాళ్లు మాస్క్లు ధరించగా, మరికొందరు ధరించలేదు. అది వారి వ్యక్తిగతం. అయితే మేం ప్రయాణంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. పర్యటన ముందే కొవిడ్-19 గురించి ఆటగాళ్లకు అవగాహన కల్పించాం. ఆరోగ్య జాగ్రత్తలు వివరించాం. పర్యటన ముగిసినా వైద్యులు వారితో అందుబాటులో ఉంటారు"