భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే జరిగే అవకాశాలు కనిపించడం లేదు! ధర్మశాల వేదికగా మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ఆరంభమవ్వాల్సిన ఈ మ్యాచ్ టాస్ ఇంకా పడలేదు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షమే ఇందుకు కారణం. ఉదయం మొదలైన వర్షం ఆగి ఆగి కురుస్తోంది. ప్రస్తుతం వాన తగ్గినా.. ఆకాశం మేఘావృతమై ఉండటం వల్ల ఆటపై సందిగ్ధం నెలకొని ఉంది. పిచ్ కూడా తడిగా ఉంది. సాయంత్రం 6గంటల 30 నిముషాలకు మైదానం సిద్ధం చేయగలిగితే టీ20 రూపంలో ఆట జరగనున్నట్లు బీసీసీఐ తెలిపింది.
భారత్Xదక్షిణాఫ్రికా: వర్షం తగ్గితే టీ20 మ్యాచ్ చూడొచ్చు
ధర్మశాల వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య నేడు తొలి వన్డే జరగాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం ప్రారంభం కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఇప్పటికీ టాస్ పడలేదు. ప్రస్తుతం వాన తగ్గడం వల్ల మ్యాచ్ను 20ఓవర్లకు కుదించాలని బీసీసీఐ భావిస్తోంది. సాయంత్రం 6గంటల 30 నిముషాలకు మైదానం సిద్ధమైతే టీ20 రూపంలో ఆట జరగనుంది.
వర్షం పడకపోతే వన్డే.. టీ20 మ్యాచ్ అవుతుందా?
ప్రస్తుతం మైదానం చిత్తడిగా ఉండటం, సరైన వెలుతురు లేమి కారణంగా మ్యాచ్ జరగకపోవచ్చని అభిమానులు భావిస్తున్నారు. అందుకే మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన కొద్దిమంది కూడా నెమ్మదిగా వెళ్లిపోతున్నారు. ఈ వన్డే రద్దయితే రెండో మ్యాచ్ మార్చి 15న లఖ్నవూ వేదికగా జరగనుంది.