నందమూరి ఫ్యాన్స్కు ఇది సూపర్ వార్త! ఎందుకంటే నందమూరి హీరోలిద్దరూ ఒకే వేదికపై కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది.
అగ్ర కథానాయకుడు బాలకృష్ణ కొత్త సినిమా 'అఖండ'(akhanda movie). డిసెంబరు 2న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే నవంబరు 27వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్(akhanda pre release event) నిర్వహించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే హీరోలు ఎన్టీఆర్(ntr jr new movie), నానిలను ఈవెంట్కు ఆహ్వానించారట. అందుకు వారిద్దరూ సుముఖత వ్యక్తం చేశారని.. త్వరలో ప్రకటన వచ్చే అవకాశముంది.
ఒకవేళ ఇదే నిజమైతే నందమూరి ఫ్యాన్స్కు నిజంగా పండగే. గతంలో 'అరవింద సమేత' ప్రీ రిలీజ్ ఈవెంట్కు బాలయ్య(balayya dialogues), కల్యాణ్రామ్ హాజరయ్యారు. అప్పుడు అబ్బాయి కోసం బాబాయ్ వస్తే.. ఇప్పుడు బాబాయ్ కోసం అబ్బాయ్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
'అఖండ'లో(balakrishna akhanda movie) బాలయ్య రెండు పాత్రల్లో నటించారు. ఆయన సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా చేసింది. శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్రలు పోషించారు. తమన్(thaman songs) సంగీతమందించగా, బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి.. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు.
మరోవైపు ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో(rrr release date) జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నాని 'శ్యామ్సింగరాయ్' చిత్రం(shyam singha roy story) డిసెంబరు 24న థియేటర్లలోకి రానుంది.
ఇవీ చదవండి: