రాశీఖన్నాకు బాలీవుడ్​లో మరో బడా ఆఫర్​!

author img

By

Published : Nov 18, 2021, 7:00 PM IST

Updated : Nov 18, 2021, 7:21 PM IST

raasi khanna

ఇప్పటికే రెండు హిందీలో వెబ్​సిరీస్​లలో నటిస్తున్న హీరోయిన్​ రాశీఖన్నాకు(rashi khanna bollywood movies) మరో ఆఫర్​ వచ్చిందని తెలిసింది. హీరో సిద్ధార్థ్​ మల్హోత్రా నటిస్తున్న 'యోధా'(siddharth malhotra yodha movie) సినిమాకు ఆమె ఎంపికైందని సమాచారం.

రాశీఖన్నా(rashi khanna bollywood movies) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ కెరీర్​లో ముందుకెళ్తోంది. తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటిస్తూనే బాలీవుడ్​లోనూ మెరిసేందుకు ప్రయత్నాలు చేస్తోంది(rashi khanna upcoming movie). తాజాగా ఓ హిందీ మూవీలో ఆమె ఎంపికైనట్లు సమాచారం.

ఇటీవలే 'షేర్షా'(siddharth malhotra shershah) చిత్రంతో విజయాన్ని అందుకున్న సిద్ధార్థ్​ మల్హోత్రా.. ప్రస్తుతం 'యోధా'లో నటిస్తున్నారు. కరణ్​ జోహార్​ నిర్మిస్తున్న ఈ సినిమాకు పుష్కర్​ ఓజా దర్శకత్వం వహిస్తున్నారు. నేడు(గురువారం) ఈ చిత్ర ఫస్ట్​లుక్​ విడుదలైంది(siddharth malhotra yodha movie). ఈ చిత్రంలోనే ఇద్దరు కథానాయికలు నటించనున్నారని వారి వివరాలను త్వరలోనే తెలియజేస్తామని తెలిపింది చిత్రబృందం. ఆ ఇద్దరు హీరోయిన్లలలో ఒకరు దిశపటాని కాగా మరొకరు రాశీ అని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

ప్రస్తుతం హిందీలో అజయ్​దేవగణ్​తో 'రుద్రా', రాజ్​డీకే దర్శకత్వంలో తెరకెక్కనున్న వెబ్​సిరీస్​లలో నటిస్తోంది రాశీ(rashi khanna latest movies). దీంతో పాటే తెలుగులో 'థ్యాంక్యూ', 'పక్కాకమర్షియల్'​ తమిళంలో 'సైతాన్​ కా బచ్చా', 'సర్దార్', 'మేథావి' సినిమాలను చేస్తోంది.

ఇదీ చూడండి: గోల్డెన్​ డ్రెస్​లో రాశీఖన్నా.. చార్లీ చాప్లిన్‌గా నభా

Last Updated :Nov 18, 2021, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.