తెలంగాణ

telangana

వారికే నా ఓటు వేశా: బాలకృష్ణ

By

Published : Oct 10, 2021, 10:00 AM IST

Updated : Oct 10, 2021, 10:32 AM IST

'మా' ఎన్నికల్లో(maa elections 2021) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు బాలకృష్ణ. ఈ ఎలక్షన్స్​లో పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణులు తనకు అన్నదమ్ముల్లాంటి వారని అన్నారు.

bala
బాలకృష్ణ

'మా' ఎన్నిక(maa elections 2021 schedule) పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణులు అన్నదమ్ముల్లాంటి వారని అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. 'మా' ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

"ఎవరు బాగా చేస్తారో వాళ్లకే ఓటు వేశా. రెండు ప్యానెల్స్‌ ఉత్సాహం చూస్తుంటే ఇండస్ట్రీకి మంచి చేసేటట్లు కనిపించారు. ఇరు ప్యానెల్స్‌లో ఎవరు మంచి చేస్తారో వారికే ఓటు వేశా. ఏదైనా అధ్యక్షులుగా నిలబడిన ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు ఇద్దరూ ఇండస్ట్రీకి అన్నదమ్ముల్లాంటి వారే. ఇద్దరూ మాటలు చెప్పేవాళ్లు కాదు, చేసేవాళ్లే. షూటింగ్స్‌లో అందరం కలిసి కట్టుగా పనిచేసుకుంటాం. 'మా' అంతిమ లక్ష్యం నటీనటుల సంక్షేమం. ఎవరు గెలిచినా వారు వెనుక నిలబడి ప్రోత్సాహం అందిస్తాం" అని బాలకృష్ణ అన్నారు.

త్వరలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'అఖండ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు బాలకృష్ణ.

బాలకృష్ణ

ఇదీ చూడండి: వారికే నా ఓటు వేశా: బాలకృష్ణ

Last Updated : Oct 10, 2021, 10:32 AM IST

ABOUT THE AUTHOR

...view details