పెళ్లయిన మూడు నెలలకే ఓ వివాహిత తనువు చాలించింది. భర్త విధులకు వెళ్లివచ్చేసరికే ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సంగారెడ్డి జిల్లా చిట్కుల్లో ఈ ఘటన జరిగింది.
పటాన్చెరు మండలం చిట్కుల్లోని నాగార్జున కాలనీకి పదిహేను రోజుల క్రితం రాఘవేంద్ర, సుకన్య దంపతులు నివాసం ఏర్పాటుచేసుకున్నారు. కర్థనూరు సమీపంలోని ఎంఎస్ఎన్ పరిశ్రమలో రాఘవేంద్ర కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం భర్త విధులకు వెళ్లగా.. ఇంట్లో కిటికీ చువ్వలకు ఉరివేసుకొని సుకన్య ఆత్మహత్యకు పాల్పడింది.