తెలంగాణ

telangana

చలివాగులో కానిస్టేబుల్ గల్లంతు

By

Published : Oct 22, 2020, 10:40 PM IST

వాగులో కానిస్టేబుల్ గల్లంతైన ఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాల సమీపంలో చలివాగులో చోటుచేసుకుంది. ఘటనా స్థలికి ఏసీపీ శ్రీనివాస్ చేరుకుని పరిశీలించారు.

conistable fall in water in warangal rural district
చలివాగులో కానిస్టేబుల్ గల్లంతు

వరంగల్ రూరల్ జిల్లా పరకాల సమీపంలో చలివాగులో చేపలు పట్టడానికి వెళ్లి టీఎస్​ఎస్​పీ నాలుగో బెటాలియన్​ కానిస్టేబుల్ సింగిరెడ్డి శ్రీధర్ గల్లంతయ్యారు. ఘటనా స్థలికి ఏసీపీ శ్రీనివాస్ చేరుకుని పరిశీలించారు.

శ్రీధర్ ప్రస్తుతం మెడికల్ లీవ్​లో ఉన్నాడని ఆయన తెలిపారు. తండ్రి సుదర్శన్, బావ జాన్, సోదరుడు ఉపేందర్‌తో కలిసి చేపలు పట్టడానికి వచ్చి చలివాగులోని నీటిలోకి దిగగా.. కాళ్లకు ఏదో చుట్టుకొని మునిపోయాడని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:హెచ్చరిక.. రాగల 24 గంటలు అప్రమత్తత అవసరం

ABOUT THE AUTHOR

...view details