తెలంగాణ

telangana

అంధకారంలో లంక, దేశమంతా కరెంట్​ బంద్​! మరో సమస్యలో ద్వీపదేశం

By PTI

Published : Dec 10, 2023, 7:10 AM IST

Sri Lanka Power Outage Today : ద్వీప దేశం శ్రీలంక మరో సమస్యలో చిక్కుకుంది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంకకు విద్యుత్​ సమస్య వచ్చి పడింది.

sri lanka power outage today
sri lanka power outage today

Sri Lanka Power Outage Today : తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న ద్వీప దేశం శ్రీలంకను విద్యుత్‌ సమస్య కూడా చుట్టు ముట్టింది. సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల దేశ వ్యాప్తంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈ మేరకు విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా వ్యవహారాల సంస్థ సిలోన్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) ప్రకటన విడుదల చేసింది. విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు సీఈబీ అధికార ప్రతినిధి వివరించారు. విద్యుత్‌ సరఫరా ఆగిపోవడం వల్ల ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి. కాట్‌మలే-బియగమా మధ్య ప్రధాన విద్యుత్‌ లైనులో సమస్య ఏర్పడడమే సరఫరాకు అంతరాయం తలెత్తినట్లు ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అవసరమైన చర్యలు ప్రారంభించామని, కొద్ది గంటల్లోనే పూర్తిస్థాయిలో విద్యుత్​ను పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది.

ఇప్పటికే రోజులో 10 గంటల విద్యుత్ కోత
గత కొంతకాలంగా శ్రీలంకలో విద్యుత్‌ కోతలు సర్వసాధారణమయ్యాయి. రోజుకు దాదాపు 10 గంటల పాటు విద్యుత్‌ సరఫరాలో కోత పెడుతున్నారు. అయితే, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం వల్ల అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఆస్పత్రుల్లో రోగుల పరిస్థితి గందరగోళంగా మారింది. శ్రీలంక ఎక్కువగా జల విద్యుత్​పైనే ఆధారపడి ఉంటుంది. బొగ్గు, చమురును తక్కువగా ఉపయోగిస్తారు. అయితే, వేసవి కాలంలో జలశయాల్లో నీరు అడుగంటడం వల్ల బొగ్గుతో విద్యుత్పత్తి చేస్తుంటారు.

ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పన్నులు పెంపు
Sri Lanka Crisis 2022 :గతేడాది నుంచి శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఫలితంగా ఆహారపదార్థాలు, ఔషధాలు, ఇంధనం ఇలా అన్నింటికీ కొరత ఏర్పడింది. విదేశీ మారక నిల్వలు కూడా తక్కువ కావడం వల్ల ఇంధన రవాణాకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీంతో అప్పటి అధ్యక్షుడు గొటబాయ రాజపక్సెకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు ప్రజలు. తర్వాత ఆయన రాజీనామా చేయడం వల్ల నూతన అధ్యక్షుడిగా రణిల్​ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. విద్యుత్​ ఛార్జీలు, ఆదాయపు పన్నులు పెంచి రాబడిని అధికం చేశారు.

లంకలో దయనీయ పరిస్థితులు.. క్యూలైన్లలోనే కుప్పకూలుతున్న ప్రజలు!

లంకలో ఆగ్రహజ్వాల.. ప్రధాని ఆఫీస్​లోకి ఆందోళనకారులు.. రాజీనామాకు డిమాండ్​!

ABOUT THE AUTHOR

...view details