తెలంగాణ

telangana

సముద్రంలో పడవ బోల్తా.. 30 మంది మృతి

By

Published : Feb 26, 2023, 1:57 PM IST

Updated : Feb 26, 2023, 2:23 PM IST

వలసదారుల పడవ సముద్రంలో మునిగి 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు కోస్టు గార్డు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో బోటులో 100 మంది ఉన్నట్లు పేర్కొన్నారు.

italian boat accident
italian boat accident

ఇటలీలో ఘోర బోటు ప్రమాదం జరిగింది. అయోనియన్ సముద్రంలో పడవ మునిగి 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో బోటులో 100 మంది వలసదారులు ఉన్నట్లు పేర్కొన్నారు. కోస్టు ​గార్డు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కాలాబ్రియాలోని తీరప్రాంత పట్టణం క్రోటోన్ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిందీ ప్రమాదం.

బోటు ప్రమాదంలో దాదాపు 40 మంది ప్రయాణికులు బయటపడినట్లు సహాయక చర్యల్లో పాల్గొన్న అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నామని వెల్లడించారు. మృతుల్లో నెలల చిన్నారి కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. కోస్టు గార్డ్, బార్డర్​ పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి చెందిన నౌకలు సహాయక చర్యలలో పాల్గొన్నాయని తెలిపారు. పడవపై వలస వచ్చిన వారు ఏ దేశస్థులో ఇంకా తెలియలేదని అన్నారు. పడవ ఎక్కడ నుంచి వచ్చిందో కూడా ఇంకా తెలియలేదని చెప్పారు.

నైజీరియాలో పడవ ప్రమాదం..
2022 అక్టోబరులో నైజీరియాలో జరిగిన పడవ ప్రమాదంలో 76 మంది మరణించారు. మరికొందరు గల్లంతయ్యారు. 85 మందితో వెళ్తున్న పడవ ఒగ్​బారూ ప్రాంతంలో వరదల కారణంగా ఒక్కసారిగా మునిగిపోవడమే అందుకు కారణం. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఇతర విభాగాల సిబ్బందిని రంగంలోకి దింపారు. గల్లంతైన వారి కోసం గాలించి.. 76 మృతదేహాలను వెలికితీశారు.

ఈ బోటు ప్రమాదంపై నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ విచారం వ్యక్తం చేశారు. పడవలోని ప్రతి ఒక్కరి ఆచూకీ తెలిసే వరకు సహాయక చర్యలు కొనసాగుతాయని బాధితులకు హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భవిష్యత్​లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా ప్రమాణాలు పాటించేలా చూడాలని అధికారుల్ని నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్​ బుహారీ ఆదేశించారు.

Last Updated :Feb 26, 2023, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details