ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వైద్య సిబ్బంది, పీపీఈ కిట్ల కొరత ఓవైపు వేధిస్తోంది. ఫలితంగా వారి రక్షణ గాలిలో దీపంలా తయారైంది. ఈ నేపథ్యంలో రోగి ఆరోగ్య పరిస్థితిని ప్రతి నిమిషం పర్యవేక్షించడం కష్టతరంగా మారింది. ఇందుకు పరిష్కారంగా నెదర్లాండ్స్ ఆమ్స్టర్డ్యామ్కు చెందిన ప్రముఖ ఆరోగ్య సాంకేతిక సంస్థ 'రాయల్ ఫిలిప్స్' సరికొత్త ఆవిష్కరణ చేపట్టింది. ఆసుపత్రుల్లో కరోనా రోగులను పర్యవేక్షించేందుకు వీలుగా బయోసెన్సార్ను అభివృద్ధి చేసింది.
ఇది ఏక కాలంలో ఎక్కువ మంది రోగులపై దృష్టి సారించేందుకు ఉపయోగపడనుంది. ఆసుపత్రుల్లో వినియోగించేందుకు అమెరికాకు చెందిన ఆహార ఔషధ నిర్వహణ సంస్థ(ఎఫ్డీఏ) నుంచి క్లియరెన్స్ పొందినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఇలా పనిచేస్తుంది...
ఫిలిప్స్ బయోసెన్సార్ బీఎక్స్100 అని పిలిచే ఈ పరికరం ఎంతో తేలికైనది. దీనిని రోగి ఛాతికి అమర్చుతారు. ఈ పరికరమే బాధితుడి శ్వాసకోస, హృదయ స్పందన రేటును ప్రతి నిముషానికి నమోదు చేసి భద్రపరుస్తుంది. ఫలితంగా రోగికి మరింత కచ్చితత్వంతో చికిత్స అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఆరోగ్య పరిస్థితుల్లో అనూహ్య మార్పు సంభవిస్తే వెంటనే వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది.