తెలంగాణ

telangana

Rajinkanth Golden Ticket : అప్పుడు బిగ్​బీ.. ఇప్పుడు సూపర్​స్టార్.. 'జైలర్'​ హీరోకు బీసీసీఐ 'గోల్డెన్​ టికెట్'​!

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2023, 5:23 PM IST

Updated : Sep 20, 2023, 6:09 AM IST

Rajinkanth Golden Ticket : భారత్​లో ప్రముఖులకు అందించే గోల్డెన్​ టికెట్​ల పంపిణీ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు బాలీవుడ్​ బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​, క్రికెట్​ లెజెండ్​ సచిన్​ తెందూల్కర్​లు ఈ టికెట్​ను అందుకోగా.. తాజాగా సూపర్​స్టార్ రజనీకాంత్​కు కూడా ఈ గోల్డెన్​ టికెట్​ను అందజేశారు బీసీసీఐ సెక్రేటరీ జై షా. ఆ వివరాలు.

BCCI Golden Ticket To Superstar Rajinikanth
ICC World Cup 2023 Golden Ticket To Rajinikanth

Rajinkanth Golden Ticket :క్రికెట్​ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2023 ప్రపంచకప్​ పోరుకు సరిగ్గా 15 రోజుల సమయం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రముఖులకు అందించే గోల్డెన్​ టికెట్​ల పంపిణీ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ నెలలోనే ఆ టికెట్​లను బాలీవుడ్​ దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చన్​, క్రికెట్​ గాడ్​ సచిన్​ తెందూల్కర్​లు అందుకోగా.. మంగళవారం తమిళ తలైవ సూపర్​స్టార్ రజనీకాంత్​ కూడా అందుకున్నారు. దీనిని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) సెక్రేటరీ జై షా ఆయనకు అందజేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ తమ అధికారిక ఎక్స్​(ట్విట్టర్​) వేదికగా ప్రకటించింది.

ఏంటీ గోల్డెన్​ టికెట్​..?
What Is Golden Ticket In World Cup : మరో 15 రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్-2023 ప్రచారంలో భాగంగా బీసీసీఐ ఈ గోల్డెన్​ టికెట్ల పంపిణీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. వీలైనంత ఎక్కువగా ఈ టోర్నీకి ప్రచారం కల్పించడమే లక్ష్యంగా దీనిని తీసుకువచ్చారు. ఇందులో భాగంగా దేశంలోని సెలబ్రిటీలకు ఈ గోల్డెన్​ టికెట్లను ఇస్తున్నారు. ఇది పొందిన ప్రముఖులు ఈ మెగా ఈవెంట్​లో భాగంగా జరిగే మ్యాచులన్నింటినీ వీఐపీ గ్యాలరీలో కూర్చొని మరీ ఫ్రీగా వీక్షించవచ్చు. వీరికి సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది బీసీసీఐ. ఇక ఇప్పటివరకు అమితాబ్​ బచ్చన్​, సచిన్​ తెందూల్కర్​, రజనీకాంత్‌లు ఈ గోల్డెన్​ టికెట్లను పొందారు.

ICC World Cup 2023 : 2023లో జరగనున్న ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్​కు భారత్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఈ ప్రపంచ కప్ సమరం జరగనుంది. అక్టోబర్​ 5న గుజరాత్​ అహ్మదాబాద్​లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఇంగ్లాండ్​, న్యూజిలాండ్​ మధ్య జరిగే పోరుతో ఈ మెగా ఈవెంట్​కు తెరలేవనుంది. ఇక ఇదే మైదానంలో ఆదివారం నవంబర్​ 19న ఫైనల్​ మ్యాచ్​లో ప్రత్యర్థులు తలపడతారు. ఇకపోతే భారత్​ తన తొలి మ్యాచ్​ను చెన్నై వేదికగా అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడనుంది.

Last Updated :Sep 20, 2023, 6:09 AM IST

ABOUT THE AUTHOR

...view details