తెలంగాణ

telangana

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు అదృశ్యం

By

Published : Apr 10, 2021, 11:39 AM IST

Updated : Apr 10, 2021, 1:02 PM IST

Three girls from the same family missing in Vanasthalipuram
వనస్థలిపురంలో ముగ్గురు బాలికలు అదృశ్యం

11:36 April 10

వనస్థలిపురంలో ముగ్గురు బాలికలు అదృశ్యం

హైదరాబాద్ వనస్థలిపురంలో ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. ప్రగతినగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు కనిపించకుండా పోయారు. నిన్న ఉదయం నుంచి బాలికలు ఐశ్వర్య(17), ఆస్మా(15), అబీర్(14) అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అయితే స్థానికంగా ఉండే రమేశ్ అనే యువకుడు, అతని స్నేహితులు కిడ్నాప్ చేయించినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఐశ్వర్యను ప్రేమిస్తున్నాని వెంటపడతుండటం వల్ల పలుమార్లు బాధిత కుటుంబసభ్యులు రమేశ్​ని హెచ్చరించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు...  కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రమేశ్​ను అరెస్టు చేశారు. దర్యాప్తు చేపట్టారు.

Last Updated :Apr 10, 2021, 1:02 PM IST

ABOUT THE AUTHOR

...view details