Three missing in RK Beach : విశాఖపట్టణంలోని ఆర్కే బీచ్లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్కు చెందిన 8మంది స్నేహితులు.. కొత్త సంవత్సరం వేడుకలు చేసుకోవాలని విశాఖపట్టణం వెళ్లారు. ఆర్కే బీచ్లో ఈత కోసం దిగారు. 8మందిలో ముగ్గరు గల్లంతవ్వగా... ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. ఊహించని ఘటనతో బాధితుల కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
హైదరాబాద్ బేగంపేట రసూల్పురా ఇందిరమ్మ కాలనీకి చెందిన పవన్, శివకుమార్, అజిస్, శివకుమార్, వినోద్, సిద్దు, మధు సహా మొత్తం 8 మంది గత నెల 30న కాచిగూడ నుంచి రైల్లో విశాఖపట్టణం వెళ్లారు. డిసెంబరు 31న ఆర్కే బీచ్లో గడిపారు. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. జనవరి 2న మరోసారి ఆర్కే బీచ్కు వెళ్లారు. సాయంత్రం హైదరాబాద్ తిరిగి వచ్చేందుకు రైల్లో రిజర్వేషన్ సైతం చేసుకున్నారు. బీచ్లోకి దిగిన 8 మంది సరదాగా గడిపారు. ఫోటోలు దిగేందుకు ఇద్దరు శివకుమార్లతోపాటు అజీస్ సముద్రంలోకి వెళ్లారు. అలల ఉద్ధృతికి ముగ్గురు నీటిలోకి జారిపోయారు. మిగతావారు చూస్తుండగానే గల్లంతయ్యారు.