తెలంగాణ

telangana

నీ వెంటే నేనంటూ... చితిలోనూ తోడైన దాంపత్య బంధం

By

Published : May 1, 2022, 10:21 AM IST

Old Couple Died in Warangal: అగ్నిసాక్షిగా ఒక్కటైన ఆ దంపతులు వృద్ధాప్యం వరకు కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచారు. పిల్లలకు పెళ్లి చేశారు. అవసాన దశలో ఎవరిపై ఆధారపడకుండా జీవిస్తున్నారు. మంచాన పడ్డ భార్యకు.. చివరి దాకా సేవలు చేశాడు ఆ భర్త. కానీ శనివారం వృద్ధాప్య సమస్యలతో పరిస్థితి విషమించి కన్నుమూశాడు. నీవు లేనిదే నేను లేనంటూ భార్య కూడా ఆయన వెంటే కాటికి వెళ్లింది. ఈ విషాద ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది.

Old Couple Died
Old Couple Died

Old Couple Died in Warangal: వృద్ధాప్యంలోనూ కలిసి జీవిస్తున్న దంపతులు ఒకే రోజు మృతి చెందారు. భర్త మృతిని తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన భార్య.. పావుగంట వ్యవధిలోనే తానూ ప్రాణాలు విడిచింది. మృత్యువులోనూ వీరి బంధం వీడలేదు. ఈ ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం నార్లవాయిలో జరిగింది. నార్లవాయి గ్రామానికి చెందిన బూర కట్టయ్య(75)- కమలమ్మ(65) కమలమ్మ దంపతులు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంచాన పడ్డ భార్యకు కొన్నాళ్లుగా భర్త సపర్యలు చేస్తున్నాడు. ఇద్దరు అనారోగ్యంతో బాధపడినా ఇన్నాళ్లు ఒకరికొకరు జీవించారు. కానీ శనివారం వృద్ధాప్య సమస్యలతో పరిస్థితి విషమించి కట్టయ్య కన్నుమూశాడు.

నీ వెంటే నేనంటూ..పతి మరణాన్ని చూసి జీర్ణించుకోలేక సతి కమలమ్మ తీవ్ర మనస్తాపం చెందింది. ఆయన మరణించిన పావుగంట వ్యవధిలోనే 'నీ వెంటే నేనంటూ.. నిన్ను విడిచి నేను ఉండలేనంటూ' కమలమ్మ కూడా కన్నుమూసింది. భార్యాభర్తలు ఒకే రోజు మృత్యువాత పడటంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇన్నాళ్లు తమ కళ్లెదుట ఒకరికొకరై బతికిన వృద్ధ దంపతులు మరణించడం గ్రామస్థుల్లో విషాదం నింపింది. బంధువులు, గ్రామస్థులు వృద్ధ దంపతులకు అశ్రునయానాలతో అంతిమ యాత్ర నిర్వహించి ఒకే చితిపై మృతదేహాలను పేర్చి అంత్యక్రియలు నిర్వహించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details