Fake Instagram Account : ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాతో బాలికను వేధింపులకు గురి చేస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఇన్స్పెక్టర్ రాము కథనం ప్రకారం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని రామ్నగర్కు చెందిన మేక పృథ్వీ(24) ఇంటర్మీడియట్ వరకు చదివాడు. ఓ ప్రైవేటు సంస్థలో ఆఫీస్బాయ్గా పనిచేస్తున్నాడు. అతని తండ్రి రెవెన్యూ శాఖలో అధికారిగా ఉన్నాడు.
'న్యూడ్ పిక్స్ పంపకపోతే.. మార్ఫింగ్ ఫొటోలు వైరల్ చేస్తా'
Fake Instagram Account : ఇన్స్టాగ్రామ్లో ఫేక్ ఖాతా తెరిచి అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతాడు. మొదట స్నేహం నటిస్తాడు. నెమ్మదిగా వారి వాట్సాప్ నంబర్ తీసుకుంటాడు. ఆ తర్వాత వారి ఫొటోలు సేకరించి అసభ్యంగా మార్ఫింగ్ చేసి వారికే పంపుతాడు. నగ్న చిత్రాలు పంపాలని లేకపోతే మార్ఫింగ్ ఫొటోలు వైరల్ చేస్తానని బెదిరిస్తాడు. ఇలా ఓ బాలికను బెదిరించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న రాచకొండ పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేశారు.
!['న్యూడ్ పిక్స్ పంపకపోతే.. మార్ఫింగ్ ఫొటోలు వైరల్ చేస్తా' Fake Instagram Account](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15722765-thumbnail-3x2-a.jpg)
చెడు అలవాట్లకు బానిసైన పృథ్వి.. అమ్మాయిల పేరిట ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచి బాలికలకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపుతున్నాడు. వారు యాక్సెప్ట్చేస్తే స్నేహం నటించి వారి వాట్సాప్ నంబర్లు, ఫొటోలు సేకరించి అసభ్యంగా మార్ఫింగ్ చేసి వారికే పంపేవాడు. వారి నగ్న చిత్రాలు పంపాలని బెదిరించేవాడు. నిరాకరిస్తే ఆ చిత్రాలను వారి సంబంధీకులందరి వాట్సాప్ల్లో పోస్టు చేసి వేధింపులకు గురిచేసేవాడు.
జనగామ జిల్లాకు చెందిన ఓ బాలికను ఇలా కొంతకాలంగా వేధించసాగాడు. ఆమె స్పందించడం మానేసి నగరానికి రావడంతో ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బెదిరించడంతోపాటు, బాలిక గ్రామంలోని వారికి సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫొటోలు అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి పెట్టాడు. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలు సేకరించి పాల్వంచకు వెళ్లి నిందుతుణ్ని అరెస్టు చేసి తీసుకొచ్చారు.