తెలంగాణ

telangana

Accident: లారీ ఓవర్‌టేక్‌.. నలుగురు మృతి

By

Published : Jun 19, 2021, 10:56 AM IST

సిమెంట్ కాంక్రీట్ మిల్లర్ లారీ రహదారిపై బీభత్సం సృష్టించింది. 167 జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Accident)లో.. నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

jadcherla accident mahabubnagar
Accident: లారీ ఓవర్‌టేక్‌.. నలుగురు మృతి

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం(Accident) జరిగింది. జడ్చర్ల మండల పరిధిలోని గంగాపూర్‌ వద్ద కాంక్రీట్‌ మిక్సర్‌ లారీ బీభత్సం సృష్టించింది. రెండు ద్విచక్ర వాహనాలు, ఒక ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. జడ్చర్ల వైపు నుంచి గంగాపూర్‌ వైపు వెళ్తున్న కాంక్రీట్‌ మిక్సర్‌ లారీ.. ముందు ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది.

ఈ క్రమంలో ద్విచక్రవాహనాలపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీ ఎదురుగా వెళ్తున్న ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తా పడటంతో ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతులను గంగాపూర్‌కు చెందిన రవి, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపూర్‌కు చెందిన సురేశ్‌, ఫార్మా పరిశ్రమలో పనిచేస్తున్న వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను మహబూబ్​నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి:Gutka Business: కిరాణ దుకాణంలో​.. గుట్కా గుట్టు రట్టు

ABOUT THE AUTHOR

...view details