తెలంగాణ

telangana

'భాజపా మంత్రాలకు చింతకాయలు రాలవు.. తెరాస తంత్రాలతో ప్రజా సమస్యలు తీరవు'

By

Published : Oct 10, 2022, 7:13 PM IST

Revanthreddy Today Tweet: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి భాజపా, తెరాస పాలనపై మరోమారు విమర్శనాస్త్రాలు గుప్పించారు. ఇరు పార్టీలను ఉద్దేశిస్తూ తనదైన శైలిలో ట్విటర్ వేదికగా​ పలు వ్యాఖ్యలు చేశారు. 'భాజపా మంత్రాలకు చింతకాయలు రాలవు.. తెరాస తంత్రాలతో ప్రజల సమస్యలు తీరవంటూ' వ్యంగ్యాస్తాలు సంధించారు.

Revanthreddy
Revanthreddy

Revanthreddy Today Tweet: భాజపా, తెరాస పాలనపై నిత్యం నిప్పులు చెరుగుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరోసారి ఇరు పార్టీలను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. భాజపా, తెరాస రెండు పార్టీలు చీకటి దోస్తీ ప్రజలకు అర్థమైపోయిందని రేవంత్​రెడ్డి ఆరోపించారు. భాజపా మంత్రాలకు చింతకాయలు రాలవు.. తెరాస తంత్రాలతో ప్రజల సమస్యలు తీరవంటూ ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.

సమస్యలపై చర్చ జరగకుండా ప్రజల్ని భాజపా, తెరాస తప్పుదోవ పట్టిస్తున్నాయని రేవంత్​రెడ్డి విమర్శించారు. ఈ గజకర్ణ గోకర్ణ టక్కు టమార డ్రామాలు మాని.. పరిపాలన, ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తే మంచిదని రేవంత్‌ రెడ్డి ట్విటర్​లో సూచించారు. రెండు పార్టీలను ఉద్దేశిస్తూ పరిపాలనపై పలు సూచనలు చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details