తెలంగాణ

telangana

Telangana News Today : టాప్​న్యూస్ @ 7AM

By

Published : Aug 9, 2022, 6:59 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today

  • నేటి నుంచి రాష్ట్రంలో జాతీయ జెండాల పంపిణీ

national flags distribution in Telangana: నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా త్రివర్ణ పతాకాల పంపిణీ జరగనుంది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 15న రాష్ట్రంలోని ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగురవేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇంటింటికీ ఉచితంగా పంపిణీ చేసేందుకు వీలుగా కోటీ 20 లక్షల త్రివర్ణ పతాకాలను ప్రజలకు పంచనున్నారు.

  • చట్టానికి విరుద్ధంగా జీవో 121

Telangana high court on vro system abolition: వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 2020లో తీసుకువచ్చిన చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 121 ఉందంటూ సోమవారం హైకోర్టు వ్యాఖ్యానించింది.

  • స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్లు

Tsrtc Independence Day Special Offers: స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్బంగా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ పలు ఆఫర్లను ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జన్నార్​లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

  • క్యాసినో వ్యవహారం.. కీలక ఆధారాలు సేకరించిన ఈడీ

Chikoti Praveen: క్యాసినో వ్యవహారంలో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. నాలుగు రోజులపాటు చికోటి ప్రవీణ్‌ను విచారించిన ఈడీ.. పలు వివరాలు సేకరించింది. ప్రవీణ్‌, అతని కుటుంబ సభ్యులు, డైరెక్టర్ల కంపెనీలపై ఈడీ ఆరా తీస్తోంది.

  • మునుగోడు ఉపపోరుకు సిద్ధం

Munugodu By election: రాష్ట్రంలో మరో ఉపఎన్నిక ఖాయమైంది. మునుగోడు శాసనసభ్యుడు రాజ్‌గోపాల్‌రెడ్డి రాజీనామా ప్రకటనలతో రాజకీయ వేడిని రగల్చగా తాజాగా ఆయన ఎమ్మెల్యే పదవి రాజీనామా ఆమోదంతో ఉపఎన్నికపై సందిగ్ధత వీడింది. ఇక మునుగోడు కదనరంగంలోకి దూకేందుకు రాజకీయ పార్టీలు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీలన్నింటికి సవాల్‌గా మారిన ఈ ఉపఎన్నిక పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.

  • అగ్నిగోళంలా సూర్యుడు.. అసలేం జరుగుతోంది..?

సూర్యుడిపై కేవలం రెండు వారాల వ్యవధిలోనే 35 భారీ విస్ఫోటనాలు, 14 సన్‌స్పాట్‌లు‌, ఆరు సౌర జ్వాలలు సంభవించాయని.. 2025లో సౌర చక్రం గరిష్ఠ స్థాయికి చేరుకోనుందని తెలిపింది నాసా. భూమిపై ఉన్న జీవరాశులు, సాంకేతికత, అలాగే కృత్రిమ ఉపగ్రహాలు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, వ్యోమగాములపైనా ఇవి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

  • హోమ్​ లోన్లకు గిరాకీ.. ఐదేళ్లలో రూ.48లక్షల కోట్లకు విపణి'

Home loan SBI Research: గృహరుణాలకు దేశంలోని మూడు, నాలుగో శ్రేణి పట్టణాల నుంచి అధిక గిరాకీ లభిస్తోంది. గత ఏడాది కాలంలో దేశంలోని ప్రధాన నగరాల కంటే చిన్న నగరాలు, నగర శివారు ప్రాంతాల్లో ఇళ్ల ధరలు పెరిగాయని 'ఎస్​బీఐ రీసెర్చ్' నివేదికలో వెల్లడైంది. మహిళలు సైతం అధికంగా రుణాలు తీసుకుంటున్నారు.

  • క్రీడల్లో మరింత ఎదగలేమా?

Common wealth Games 2022 India: కామన్వెల్త్​ క్రీడలు 2022ను భారత్​ నాలుగో స్థానంతో ముగించింది. మొత్తం 61 పతకాలు సాధించింది. ఇందులో 22 స్వర్ణపతకాలు సహా 16 రజతం, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. అయితే భిన్న క్రీడాంశాల్లో పతకాలను ఒడిసిపట్టడంలో ఈసారీ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, కెనడాల ఆధిపత్య ప్రదర్శన కొనసాగింది. అదే మనదగ్గర సక్రమంగా వ్యవస్థాగత సహకారం, ప్రోత్సాహం లభిస్తే మన అథ్లెట్స్​ మరిన్ని మెడల్స్​ తీసుకొచ్చేవారు.

  • కామన్వెల్త్ క్రీడల్లో మన 'బంగారాలు' వీరే..

కామన్వెల్త్​ క్రీడలు 2022ను భారత్​ నాలుగో స్థానంతో ముగించింది. మొత్తం 61 పతకాలు సాధించింది. ఇందులో 22 స్వర్ణపతకాలు సహా 16 రజతం, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆటల చివరి రోజు భారత షట్లర్లు అదరగొట్టారు. 3 బంగారు పతకాలు సాధించారు. టేబుల్​ టెన్నిస్​లో శరత్​ కమల్​కు గోల్డ్​, సాతియాన్​ జ్ఞానేశ్వరన్​కు కాంస్యం రాగా.. పురుషుల హాకీ జట్టు రజతం సాధించింది. మరి ఈ క్రీడల్లో పసిడి నెగ్గింది ఎవరెవరో చూద్దాం.

  • ఇకపై అలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధమే: రష్మిక

ఇకపై 'ఆ' పాత్రల్లోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది హీరోయిన్​ రష్మిక. తన డ్రీమ్​ రోల్​ ఏంటో తెలిపింది. సీతారామం మూవీ తనకెంతో ప్రత్యేకమని పేర్కొంది. ఇంకా కెరీర్​ గురించి పలు విషయాలను తెలిపింది. ఆ సంగతులివీ..

ABOUT THE AUTHOR

...view details