Telangana Minister KTR : హైదరాబాద్ బాపూ ఘాట్లోని.. ప్రాచీన బావి పునరుద్ధరణ అనంతరం... జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి కేటీఆర్ పునఃప్రారంభించారు. బావిలో మంచి నీటిని పోసి రెండు తాబేళ్లను వదిలారు. దీనికి సంబంధించిన ఫొటోలను మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ట్విటర్లో షేర్ చేశారు.
Bapughat StepWell inauguration : బాపూఘాట్లో ప్రాచీనబావిని పునఃప్రారంభిన కేటీఆర్
Bapughat StepWell inauguration : హైదరాబాద్ బాపూ ఘాట్లోని ప్రాచీన బావిని పునరుద్ధరణ అనంతరం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పునఃప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి.. బావిలో మంచి నీరు పోసి రెండు తాబేళ్లను వదిలారు.
ప్రాచీనబావి పునఃప్రారంభం
Bapughat StepWell inauguration : ఈ కార్యక్రమంలో నగర మేయర్ విజయలక్ష్మి.. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ పాల్గొన్నారు. పురాతనమైన నీటి వనరులను గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ.. కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే బాపు ఘాట్లో.. పునరుద్ధరణకు కృషి చేసింది.