తెలంగాణ

telangana

ఎత్తిపోతలకు ఇబ్బందులు.. యంత్రాలు చైనా నుంచే రావాలి!

By

Published : Jun 25, 2020, 9:24 AM IST

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పలు ఎత్తిపోతల పథకాలకు చైనా నుంచి మోటార్లు, పంపులు రావాల్సి ఉంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల సమయానికి వస్తాయా లేదా అనే సంశయం ఇంజినీర్లలో ఉంది. కొవిడ్‌ వల్ల కార్మికులలో ఎక్కువ మంది వెళ్లిపోయి పనులపై ప్రభావం పడగా... యంత్రాలు రాకపోతే మరింత ఆలస్యమయ్యే , ఇప్పుడు మోటార్లు, పంపులు రావడంలో జాప్యం జరిగితే పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

lift irrigation projects problems in telanagan with china machines
ఎత్తిపోతలకు ఇబ్బందులు.. యంత్రాలు చైనా నుంచే రావాలి!

సీతారామ ఎత్తిపోతల పథకంలో మూడు ప్యాకేజీల్లో లిప్టు పనులు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన అన్ని పరికరాలు చైనా నుంచే రావాలి. మొదటి ప్యాకేజీలో ఒక్కొక్కటి 40 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఆరు పంపులు, మోటార్లు చైనా నుంచి రావడంతో పనులు కూడా పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఐదో ప్యాకేజీలో ఒక్కొక్కటి 40 మెగావాట్లతో ఆరు పంపులు, మోటార్లు అమర్చాల్సి ఉండగా, ఇటీవలే ప్రధానమైనవన్నీ వచ్చాయి. అనుబంధ పరికరాలు కొన్ని రావాల్సి ఉంది.

ఆరో ప్యాకేజీలో ఐదు పంపులు, మోటార్లు 40 మెగావాట్ల సామర్థ్యంతో, రెండు పంపులు 30 మెగావాట్ల సామర్థ్యంతో అమర్చాల్సి ఉంది. ఇవన్నీ కూడా చైనా నుంచే రావాలి. షాంఘై ఇంజినీరింగ్‌ కంపెనీ ద్వారా ఇవి సరఫరా అవుతాయి. ఇప్పటికే బయలుదేరినట్లు సమాచారం ఉందని, ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారానికి వచ్చే అవకాశం ఉందని సంబంధిత ఇంజినీరింగ్‌ వర్గాలు తెలిపాయి. వరదకాలువలో భాగంగా చేపట్టిన గౌరవెళ్లికి నీటిని ఎత్తిపోసే లిప్టునకు సంబంధించిన మోటార్లు, పంపులు కూడా రావాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details