తెలంగాణ

telangana

Tirupati rain news: జలదిగ్బంధంలో తిరుపతి.. వరద ముంపులో కాలనీలు

By

Published : Nov 20, 2021, 11:51 AM IST

తిరుపతిలో(Tirupati rain news) ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఇళ్లల్లో వరద ప్రవాహంతో ముంపుప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Tirupati rain news, ap rains
జలదిగ్బంధంలో తిరుపతి, ఏపీ వర్షాలు

వరద ముంపు నుంచి తిరుపతి ఇంకా తేరుకోలేదు(Tirupati rain news).చాలా కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరద ప్రవాహానికి చెరువులు తెగి నివాస ప్రాంతాలలోకి వరద పోటెత్తుతూనే ఉంది. ప్రధానంగా పద్మావతి మహిళ యూనివర్శిటీ, లింగేశ్వర నగర్‌, కేశవాయినగుంట, ఆటోనగర్‌, యశోదనగర్‌, సరస్వతీ నగర్‌, ఉల్లిపట్టెడ, శ్రీకృష్ణనగర్‌ ముంపులోనే ఉన్నాయి. గాయిత్రీనగర్​లో 2 వేల కుటుంబాలు ఇళ్ల నుంచి బయటకురాలేని పరిస్థితి నెలకొంది.

జలదిగ్బంధంలో తిరుపతి, ఏపీ వర్షాలు

మేం పనులు చేస్తుండగా ఒక్కసారిగా వరద పోటెత్తింది. చూస్తుండగానే సెల్లర్ అంతా నీటితో నిండిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మూడు రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.

- ముంపు బాధితుడు

వరదలతో లోతట్టు ప్రాంతాలు తీవ్ర ప్రభావితమయ్యాయి. బాధితులకు ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం.

-స్థానిక అధికారి

ఏపీలోని నెల్లూరు(rains in nellore)జిల్లాలో గల స్వర్ణముఖి నది (swarnamukhi river) ప్రవాహం ఉద్ధృతంగా మారింది. నాయుడుపేట నుంచి వెంకటగిరి వెళ్లే నది వంతెనపై నీరు పారుతోంది. మేనకూరు సెజ్‌లోని కంపెనీల ఉద్యోగులు, కార్మిక సిబ్బంది బస్సులు ఈ మార్గంలో పోవడం లేదు. స్వర్ణముఖి నది ప్రవాహంతో పెళ్లకూరు మండలంలోని పలు ప్రాంతాల్లో గల వ్యవసాయ పొలాలు కోతకు గురవుతున్నాయి. రైతులకు తీరని నష్టం వాటిల్లింది. పెళ్లకూరు మండలం పుల్లూరు ముమ్మారెడ్డిగుంట మధ్య నీటి పారుదల పెరిగి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిలో ప్రమాదకరంగా దాటారు.


పొంగి పొర్లుతున్న వాగులు..

గూడూరు రూరల్(rains in ap) సర్కిల్ పరిధిలోని చిల్లకూరు, మనుబోలు, సైదాపురం, గూడూరు ప్రాంతాల్లో అధికారులు... పోలీసులను (police alert) అప్రమత్తం చేశారు. ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గ్రామ మహిళా పోలీసుల సేవలు కూడా వినియోగించుకుంటున్నారు.సైదాపురం మండలం పొదలకూరు మార్గంలోని మాలేరు వాగు, పిన్నేరు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మనుబోలు మండల పరిధిలోని పంబలేరు, చల్లకాలువ వాగులు సైతం ఉధృతంగా పారుతున్నాయి. వెంకటగిరిలో రెండు రోజులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కైవల్యా నది పరవళ్లు తొక్కుతుంది. వెంకటగిరి కాశీ విశ్వనాథ స్వామి ఆలయం దగ్గర నది ప్రవాహం కొనసాగుతూ ఉంది. బాలాయపల్లి మండలం నిండలి దగ్గరి కాజ్వేపై కైవల్యా పొంగి పోర్లుతుండటంతో నిన్నట్నుంచి ఈ మార్గంలో రాకపోకలు కొనసాగడం లేదు.

జలదిగ్బంధంలో తిరుపతి, ఏపీ వర్షాలు

తృటిలో తప్పిన ప్రమాదం..

భారీ వర్షానికి గుడూరులోని పంబలేరు కాలువ పొంగిపొర్లుతోంది. వరదనీటిలో కాలువ దాటుతుండగా ఆదిశంకర ఇంజినీరింగ్ విద్యార్థులు జారి పడ్డారు. తృటిలో ప్రమాదం తప్పింది. ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో విద్యార్థులు తిరిగి వెనక్కి వెళ్లారు. వెంకటగిరిలోను భారీ వర్షాలు కురిశాయి. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవీచదవండి:Rains in Telangana: అల్పపీడనం ఎఫెక్ట్​.. రానున్న 3 రోజులు మోస్తరు వర్షాలు

ABOUT THE AUTHOR

...view details