తెలంగాణ

telangana

రాష్ట్రంలో మరో 226 కరోనా కేసులు, ఒకరు మృతి

By

Published : Jan 21, 2021, 9:47 AM IST

తెలంగాణలో కొత్తగా 226 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,92,621 మంది కొవిడ్ బాధితులున్నారు.

corona cases and deaths updates in telangana
తెలంగాణలో మరో 226 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 226 కరోనా కేసులు నమోదవ్వగా.. మహమ్మారి బారిన పడి ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,92,621 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకి ఇప్పటివరకు 1,584 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 224 మంది బాధితులు కోలుకున్నారు.

ఇప్పటివరకు 2,87,117మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 3,920 కరోనా యాక్టివ్ కేసులుండగా.. ప్రస్తుతం 2,322 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 39 కరోనా కేసులు నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details