తెలంగాణ

telangana

రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం నిధులు

By

Published : Apr 6, 2021, 4:39 PM IST

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.1005.38 కోట్లు మంజూరు చేశామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. నిధులు మంజూరు చేసినట్లు మంత్రి ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

Central funding for the development of national highways
రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం నిధులు

రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం నిధులు విడుదల చేసింది. 2020-21 ఏడాదికి గాను సుమారు 196 కిలోమీటర్ల మేర... జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.1005.38 కోట్లు మంజూరు చేశామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. నిజాంపేట్‌-బీదర్‌ జాతీయ మార్గంలో భూసేకరణ, పునరావాసానికి 27.79 కోట్లు కేటాయించామని తెలిపారు. ఎన్​హెచ్​-564లో భాగమైన నకిరేకల్‌-నాగార్జున సాగర్‌ మార్గంలో.. పనులకు అనుమతి ఇచ్చామని వివరించారు. హైదరాబాద్-బెంగళూరు ఎన్​హెచ్​-44 మార్గంలో రోడ్డు భద్రత పెంపు కోసం అండర్​పాస్, సర్వీస్ రోడ్లకు 21.16 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.

హైదరాబాద్‌-భూపాలపట్నం మార్గంలో ఆరు లైన్ల రహదారి విస్తరణకై 48.32 కోట్లు కేటాయించామని తెలిపారు. ఎల్బీ నగర్-మల్కాపూర్ ఆరు లైన్ల క్యారేజ్ వే పునరుద్ధరణ, విస్తరణ, సర్వీస్ రోడ్లు సహా భద్రత చర్యల కోసం 545.11 కోట్లు విడుదల చేశామని స్పష్టం చేశారు. ఎన్​హెచ్​-163 రహదారి 4 లైన్ల విస్తరణ, అభివృద్ధికై 317 కోట్లు మంజూరు చేశామని.. జడ్చర్ల-కల్వకుర్తి మార్గంలో 4 లైన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి పునర్నిర్మాణానికి 45 కోట్లు అందించామని నితిన్‌ గడ్కరీ వెల్లడించారు.

ఇదీ చదవండి:'న్యాయంపై ప్రజల్లో విశ్వాసం పెరిగేది అప్పుడే'

ABOUT THE AUTHOR

...view details