Twitter fires two top executives: ట్విట్టర్ను కొనుగోలు చేసిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. కీలక మార్పులు చేపట్టనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరు టాప్ మేనేజర్లను తొలగించింది ఆ సంస్థ. ట్విట్టర్ను మస్క్ కొనుగోలు చేసిన తర్వాత అంతర్గతంగా అనిశ్చితి నెలకొందనడానికి ఇది సంకేతంగా కనిపిస్తోంది.
ట్విట్టర్ జనరల్ మేనేజర్ కేవోన్ బేక్పూర్ ఏడేళ్ల తర్వాత సంస్థను వీడుతున్నారు. ఈ క్రమంలో వరుస ట్వీట్లు చేశారు కేవోన్. 'ప్రస్తుత బృందాన్ని వేరే దిశలో తీసుకెళ్లాలనుకుంటున్నానని నాకు తెలియజేసిన తర్వాత సంస్థను వీడాలని సీఈఓ పరాగ్ అగర్వాల్ కోరారు. ట్విట్టర్కు మంచి రోజులు ముందున్నాయని నేను ఆశిస్తున్నా. ప్రపంచంలో ముఖ్యమైన, ప్రత్యేక, ప్రభావవంతమైన సాధనాల్లో ట్విట్టర్ ఒకటి. సరైన మార్గనిర్దేశం ఉంటేనే ఆ ప్రభావం కనిపిస్తుంది.' అని పేర్కొన్నారు బేక్పూర్. 2015లో తన స్టార్టప్ కంపెనీని ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత సంస్థలో చేరారు.
ట్విట్టర్ రెవెన్యూ, ప్రొడక్ట్ విభాగం మేనేజర్ బ్రూస్ ఫాల్క్ను సైతం తొలగించింది సంస్థ. ప్రస్తుతం ఆయన ట్విట్టర్ ఖాతా బయోలో నిరుద్యోగి అని కనిపించటమే అందుకు నిదర్శనం.'ఇంజనీర్లకు ఈ ట్వీట్ను అంకితం చేస్తున్నా. మీతో కలిసి పని చేసే అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది కాబట్టి తిరిగి పనిలోకి వెళ్లండి.' అని ట్వీట్ చేశారు. మరోవైపు.. ఇద్దరిని తొలగించినట్లు ట్విట్టర్ ధ్రువీకరించింది. ప్రస్తుతం బిజినెస్లోని కీలక విభాగాల్లో మినహా అన్ని నియామకాలను నిలిపేసినట్లు తెలిపింది.
పరాగ్, గద్దె విజయ భవిష్యత్తేమిటి?