తెలంగాణ

telangana

రెండు వరుస సెషన్ల నష్టాలకు బ్రేక్​.. దూసుకెళ్లిన సూచీలు.. సెన్సెక్స్​ 777 ప్లస్​

By

Published : Apr 26, 2022, 9:29 AM IST

Updated : Apr 26, 2022, 3:37 PM IST

stock-market-news
బుల్​ జోరు

15:25 April 26

వరుస నష్టాలకు బ్రేక్​..

రెండు వరుస సెషన్ల నష్టాలకు బ్రేక్​ పడింది. మంగళవారం రోజు దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు దూసుకెళ్లాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 777 పాయింట్లు పెరిగి 57 వేల 357 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 247 పాయింట్ల లాభంతో 17 వేల 201 వద్ద సెషన్​ను ముగించింది.

  • లాభనష్టాల్లో..ఆటో, రియాల్టీ, విద్యుత్​ రంగం షేర్లు 2-3 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్​ఈ మిడ్​, స్మాల్​ క్యాప్​ సూచీలు 0.75-1.50 శాతం మేర రాణించాయి.
  • అదానీ పోర్ట్స్​, బజాజ్​ ఆటో​, హీరో మోటోకార్ప్​, పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్​, ఎం అండ్​ ఎం భారీగా లాభపడ్డాయి.
  • ఓఎన్​జీసీ, అపోలో హాస్పిటల్స్​, యాక్సిస్​ బ్యాంక్​, హిందాల్కో, ఏషియన్​ పెయింట్స్​ పతనమయ్యాయి.
  • సెన్సెక్స్​ 30 ప్యాక్​లో 5 మినహా అన్ని షేర్లు మంచి లాభాల్లో ముగిశాయి.
  • అమెరికా మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగియడం, ఐరోపా మార్కెట్లు ఏప్రిల్​ 26న సానుకూలంగా ప్రారంభమవడం వల్ల దేశీయ సూచీలు దూసుకెళ్లాయి.
  • రిలయన్స్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్​, బ్యాంకింగ్​ షేర్లలో కొనుగోళ్లు.. మార్కెట్లు ఊపందుకోవడానికి మరో కారణంగా వ్యాపార నిపుణులు విశ్లేషిస్తున్నారు.

09:24 April 26

stock market news

స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్​ 714 పాయింట్లు వృద్ధి చెంది 57,294కి చేరింది. నిఫ్టీ 211 పాయింట్లు మెరుగుపడి 17,165కి పెరిగింది. అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు మార్కెట్లపై పాజిటివ్ ప్రభావం చూపుతున్నాయి. హిండాల్కో మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ఉన్నాయి. బజాజ్ ఆటో, టాటా మోటార్స్​, ఇండస్​ఇండ్ బ్యాంక్​, ఎంఅండ్​ఎం, సన్ ఫార్మా షేర్లు 2 శాతానికిపైగా వృద్ధి చెందాయి.

Last Updated :Apr 26, 2022, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details