తెలంగాణ

telangana

వారసులకు పెద్దపీట, ఈశాకు రిలయన్స్ రిటైల్, అనంత్​కు న్యూ ఎనర్జీ

By

Published : Aug 29, 2022, 6:17 PM IST

esha ambani
esha ambani

వారసత్వ ప్రణాళికలో భాగంగా రిలయన్స్​ రిటైల్ బాధ్యతలను ఈశా అంబానీకి అప్పగిస్తున్నట్లు ఆ సంస్థ అధిపతి ముకేశ్ అంబానీ ప్రకటించారు. వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే చిన్న కుమారుడు అనంత్​కు న్యూ ఎనర్జీ విభాగాన్ని అప్పగించనున్నట్లు తెలిపారు.

వారసత్వ ప్రణాళికలో భాగంగా ముకేశ్​ అంబానీ రిలయన్స్ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు. తన కుమార్తె ఈశా అంబానీకి రిటైల్‌ వ్యాపారం అప్పగించారు. రిటైల్‌ బిజినెస్‌ లీడర్‌గా ఆమెను 45వ రిలయన్స్‌ వార్షిక సాధారణ సమావేశానికి పరిచయం చేశారు. చిన్న కుమారుడు, 26 ఏళ్ల అనంత్‌ అంబానీకి రిలయన్స్‌ న్యూ ఎనర్జీ వ్యాపార బాధ్యతలను అప్పగిస్తున్నట్లు ముకేశ్‌ తెలిపారు. ఇప్పటికే పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి జియో పగ్గాలు అప్పగించారు. ఆ స్థానంలో కొనసాగిన ముకేశ్.. ఈ ఏడాది జూన్ 27నే తన పదవికి రాజీనామా చేశారు.

రిలయన్స్​ సంస్ధకు మూడు విభాగాలున్నాయి. జియో, పెట్రోలియం, రిటైల్​. తన ముగ్గురు పిల్లలు మూడు బిజినెస్​ల్లో ఒక్కొకదాంట్లో కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. పెద్ద కుమారుడు ఎప్పటినుంచో జియో సంస్థలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక సోదరుడు అనంత్​ అంబానీ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ పనుల్లో నిమగ్నమయ్యారు. కవల సోదరి ఈశా సైతం రిలయన్స్​ రిటైల్​ను సక్సస్​ చేయడంలో కీలక పాత్ర వహించారు. ఇలా ముగ్గురిలోని ప్రతిభను గుర్తించిన ముకేశ్​ వారికి ఆయా రంగాలకు సంబంధించిన పగ్గాలను అప్పజెప్పారు.

ఈ సందర్భంగా రిలయన్స్‌ రిటైల్‌ బిజినెస్‌కు వాట్సాప్​ అనుసంధానంపై ఈశా అంబానీ మాట్లాడారు. 30 ఏళ్ల ఇషా వాట్సాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో సరకులు ఎలా కొనాలో, చెల్లింపులు ఎలా చేయాలో వివరించారు. రిలయన్స్​ రిటైల్​ సంస్థ త్వరలోనే ఏఫ్​ఎంసీజీ రంగంలోకి అడుగుపెట్టనుందని తెలిపారు.
ఇదీ చదవండి:
దీపావళి నాటికి జియో 5జీ సేవలు, మొదట ఆ నగరాల్లోనే

ఆయనకు గిఫ్ట్​గా లగ్జరీ విల్లా​ కొన్న అంబానీ, షాకింగ్ ధర

ABOUT THE AUTHOR

...view details