తెలంగాణ

telangana

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎలా ఉన్నాయంటే?

By

Published : Dec 28, 2022, 12:26 PM IST

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

gold-rate-today-in-hyderabad-and-vijayawada
బంగారం

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.180 పెరిగి ప్రస్తుతం రూ.56,320 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.300పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.70,560 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.56,320 గా ఉంది. కిలో వెండి ధర రూ.70,560 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.56,320 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.70,260గా ఉంది.
  • Gold price in Vijayawada: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.56,320 గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,260వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.56,320 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.70,260 గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1811.25 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.96 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.13,75,959 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.13,75,959
ఇథీరియం రూ.98,705
టెథర్​ రూ.82.85
బైనాన్స్​ కాయిన్​ రూ.20,106
యూఎస్​డీ కాయిన్ రూ.82.87

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 142 పాయింట్ల నష్టంతో 60,784 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 45 పాయింట్లు నష్టపోయి 18,086 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌, టైటన్‌, ఎన్‌టీపీసీ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, మారుతీ, సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, రిలయన్స్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

రూపాయి విలువ:
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.83 వద్ద ట్రేడవుతోంది.

ABOUT THE AUTHOR

...view details