తెలంగాణ

telangana

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధర.. బిట్​కాయిన్ పతనం

By

Published : Jul 2, 2022, 10:33 AM IST

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

GOLD PRICE TODAY
GOLD PRICE TODAY

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. శుక్రవారం ధరలతో పోలిస్తే.. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.290 ప్రియమైంది. వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. కేజీ వెండి రూ.280 మేర అధికమైంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

• Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,740గా ఉంది. కిలో వెండి ధర రూ.59,680 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,740 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.68,430గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,740గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,430 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,740గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,430 వద్ద కొనసాగుతోంది.
స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..:అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,810.45 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 19.93 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు:పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ:బిట్​కాయిన్ విలువ స్వల్పంగా పడిపోయింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.15,95,469 పలుకుతోంది. ఇథీరియం రూ.2వేలు పతనమైంది. ప్రస్తుతం రూ.88వేల వద్ద కొనసాగుతోంది.

ఇదీ చదవండి:ఇంధన ధరల జోరు.. సామాన్యుల బేజారు

ABOUT THE AUTHOR

...view details