తెలంగాణ

telangana

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతో తెలుసా?

By

Published : Jun 7, 2022, 10:40 AM IST

Updated : Jun 7, 2022, 11:11 AM IST

Gold Price Today: బంగారం, వెండి ధరలు మంగళవారం మళ్లీ తగ్గాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ. 52,500గా ఉంది. కిలో వెండి ధర రూ. 63,500గా ఉంది.

gold-price-today
gold-price-today

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు మంగళవారం తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర సోమవారంతో పోలిస్తే రూ.350 తగ్గింది. ప్రస్తుతం రూ.52,500 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.800 వరకు తగ్గింది. ప్రస్తుతం రూ.63,500కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,500గా ఉంది. కిలో వెండి ధర రూ.63,500 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,500 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,500గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,500గా ఉంది. కేజీ వెండి ధర రూ. 63,500 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,500గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,500 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర కూడా తగ్గింది. ఔన్సు బంగారం 1843 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.98 డాలర్లుగా ఉంది. డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ రూ. 77.71కి చేరింది.
ఇంధన ధరలు ఇలా..పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో.. బిట్​కాయిన్​ విలువ మళ్లీ పతనమైంది. ప్రస్తుతం రూ. 24,24,839 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.24,24,839
ఇథీరియం రూ.1,44,150
టెథర్ రూ.82.42
బినాన్స్​ కాయిన్ రూ.23,393
యూఎస్​డీ కాయిన్ రూ.82.48

Stock Market Live Updates: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు మంగళవారం సెషన్​లో భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 550 పాయింట్లకుపైగా కోల్పోయి.. 55 వేల 100 ఎగువన కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 165 పాయింట్ల పతనంతో 16 వేల 400 వద్ద ఉంది. ఓఎన్​జీసీ, కోల్​ ఇండియా, ఎన్​టీపీసీ, హిందాల్కో, బీపీసీఎల్​ స్వల్ప లాభాల్లో ఉన్నాయి. టైటాన్​ కంపెనీ, డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్స్​, హెచ్​యూఎల్​, ఏషియన్​ పెయింట్స్​, సన్​ఫార్మా అత్యధికంగా నష్టపోయాయి.

ఇవీ చదవండి:తొలి జీతం అందుకున్నారా? మరి వీటిని పాటిస్తున్నారా.. లేదా?

సంపాదన మొత్తం ఈఎంఐలకే పోతుందా? ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి..!

Last Updated :Jun 7, 2022, 11:11 AM IST

ABOUT THE AUTHOR

...view details