తెలంగాణ

telangana

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్ 123 ప్లస్​

By

Published : Aug 5, 2021, 9:36 AM IST

Updated : Aug 5, 2021, 3:44 PM IST

stocks Live updates
స్టాక్స్ లైవ్​ అప్​డేట్స్​

15:41 August 05

స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 123 పాయింట్లు పెరిగి నూతన గరిష్ఠ స్థాయి అయిన 53,493 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో జీవనకాల గరిష్ఠమైన 16,294 వద్దకు చేరింది.

  • భారతీ ఎయిర్​టెల్, ఐటీసీ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్​, హెచ్​సీఎల్​టెక్​ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • ఎస్​బీఐ, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, అల్ట్రాటెక్​ సిమెంట్ ఎక్కువగా నష్టపోయాయి.

14:51 August 05

సెషన్ చివరి గంటలో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా పెరిగి.. 54,578 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 50 పాయింట్లకుపైగా పెరిగి..16,311 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • భారతీ ఎయిర్​టెల్, ఐటీసీ, టెక్ మహీంద్రా, హెచ్​సీఎల్​టెక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • ఎస్​బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్​, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్​సర్వ్​ నష్టాల్లో ఉన్నాయి.

09:22 August 05

STOCKS LIVE

స్టాక్ మార్కెట్లలో రికార్డు లాభాలకు బ్రేక్ పడింది. గురువారం సెషన్​ను ఒడుదొడుకులతో ప్రారంభించాయి సూచీలు. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 80 పాయింట్లకుపైగా తగ్గి .. 54,288 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 30 పాయింట్లకుపైగా నష్టంతో 16,227 వద్ద కొనసాగుతోంది.

ఇటీవలి రికార్డు లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. బ్యాంకింగ్, లోహ రంగాలు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి.

వొడాఫోన్ ఐడియా షేర్లు అత్యధికంగా 14 శాతం తగ్గాయి. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ పదవి నుంచి కుమార మంగళం బిర్లా తప్పుకోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది.

  • భారతీ ఎయిర్​టెల్​, టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్​ఫార్మా, రిలయన్స్​ ఇండస్ట్రీస్​ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • ఇండస్​ఇండ్ బ్యాంక్​, టాటా స్టీల్​, మారుతీ, ఎస్​బీఐ, బజాజ్ ఫిన్​సర్వ్​ నష్టాల్లో ట్రేడింగ్ సాగిస్తున్నాయి.
Last Updated : Aug 5, 2021, 3:44 PM IST

ABOUT THE AUTHOR

...view details