తెలంగాణ

telangana

వారాంతంలో లాభాలతో ముగిసిన మార్కెట్లు

By

Published : Jul 3, 2020, 3:41 PM IST

Updated : Jul 3, 2020, 4:24 PM IST

అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిస్థితుల నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ సూచీ సెన్సెక్స్ 177 పాయింట్ల వృద్ధితో 36,021 వద్ద ముగిసింది. ఎన్​ఎస్​ఈ సూచీ నిఫ్టీ 51 పాయింట్లు లాభపడి 10,603 వద్ద స్థిరపడింది.

stocks close
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పవనాలతో వారాంతంలో దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 177 పాయింట్లు వృద్ధి చెంది 36,021 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 10, 603 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లో..

భారతీ ఎయిర్​టెల్, బజాజ్ ఆటో, ఎన్​టీపీసీ, టైటాన్, టీసీఎస్ సహా 30 షేర్ల సూచీ సెన్సెక్స్​లోని 13 సంస్థల షేర్లు లాభాలతో ముగిశాయి. హెచ్​డీఎఫ్​సీ, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ, ఎస్​బీఐ సహా 11 సంస్థల షేర్లు నష్టాలతో ముగించాయి.

ఆసియా మార్కెట్లు..

షాంఘై, హాంకాంగ్, టోక్యో, సియోల్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

రూపాయి విలువ..

డాలరు మారకం ధర 38 పైసలు బలపడి రూ.74.66 గా ఉంది.

చమురు ధరలు..

అంతర్జాతీయ విపణిలో చమురు ధర 1.69 శాతం తగ్గి 42.41 డాలర్ల వద్ద స్థిరపడింది.

ఇదీ చూడండి:52 రోజుల్లోనే వ్యాక్సిన్- 'భారత్' ఎలా సాధించింది?

Last Updated :Jul 3, 2020, 4:24 PM IST

ABOUT THE AUTHOR

...view details