తెలంగాణ

telangana

ఆరంభ లాభాలు ఆవిరి- ఫ్లాట్​గా ముగిసిన మార్కెట్లు

By

Published : Sep 27, 2021, 3:46 PM IST

stocks updates

ఒడుదొడుకుల సెషన్​ను స్టాక్ మార్కెట్లు (Stock Market) స్తబ్దుగా ముగించాయి. సెన్సెక్స్ (Sensex Today) అతి స్వల్పంగా 29 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ (Nifty Today) 17,850 మార్క్​పై ఫ్లాట్​గా ముగిసింది. ఆటోమొబైల్ షేర్లు లాభాలను గడించాయి. ఐటీ షేర్లు డీలా పడ్డాయి.

స్టాక్ మార్కెట్లు (Stock Market) సోమవారం దాదాపు ఫ్లాట్​గా ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 29 పాయింట్లు పెరిగి కొత్త రికార్డు స్థాయి అయిన 60,078వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 2 పాయింట్ల లాభంతో 17,855 వద్దకు చేరింది.

ఆటోమొబైల్​ షేర్లు సానుకూలంగా స్పందించగా.. ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఫలితంగా సూచీలు ఆద్యంతం ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్​ షేర్లు జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి.

ఇంట్రాడే సాగిందిలా (Intraday)..

సెన్సెక్స్ 60,412 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 59,887 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 17,943 పాయింట్ల గరిష్ఠ స్థాయి (కొత్త గరిష్ఠం), 17,802 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

మారుతీ సుజుకీ, ఎం&ఎం, బజాజ్ ఆటో, ఎన్​టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్​ షేర్లు లాభాలను గడించాయి.

హెచ్​సీఎల్​టెక్​, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్​సర్వ్​, ఇన్ఫోసిస్​, ఎల్​&టీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. కోస్పీ (దక్షిణ కొరియా), హాంగ్​సెంగ్ (హాంకాంగ్​) సూచీలు లాభాలను గడించాయి. షాంఘై (చైనా), నిక్కీ (జపాన్​) సూచీలు నష్టపోయాయి.

ఇదీ చదవండి:ధన్​ధనాధన్ 'రిలయన్స్'​-​ రూ.16లక్షల కోట్లకు ఎం-క్యాప్​

ABOUT THE AUTHOR

...view details