తెలంగాణ

telangana

కరోనా భయాలతో స్టాక్​ మార్కెట్లకు నష్టాలు

By

Published : Feb 10, 2020, 10:14 AM IST

Updated : Feb 29, 2020, 8:17 PM IST

కరోనా వైరస్ భయాలతో దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. 172 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్​ 40,969 వద్ద ట్రేడవుతుండగా... 51 పాయింట్ల నష్టంతో 12,046 పాయింట్ల వద్ద కొనసాగుతోంది నిఫ్టీ.

stock markets losses
స్టాక్​ మార్కెట్లకు నష్టాలు

కరోనా వైరస్ భయాలతో పాటు అంతర్జాతీయ ఈక్విటీల ప్రభావంతో దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. 172 పాయింట్లు నష్టంతో ప్రారంభమైన బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్​.. 40,969 వద్ద ట్రేడవుతోంది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం నష్టాలబాటలోనే పయనిస్తోంది. 51 పాయింట్ల నష్టంతో 12,046 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివివే

సెన్సెక్స్​లోని ముప్పై షేర్లలో టాటా స్టీల్​ 5 శాతానికి పైగా నష్టపోయింది. డిసెంబర్ త్రైమాసిక ఫలితాలలో రూ.1,228.53 కోట్ల నష్టాన్ని ప్రకటించడం షేర్ల పతనానికి కారణమైంది. టాటా స్టీల్​తో పాటు మహీంద్ర అండ్ మహీంద్ర, ఓఎన్​జీసీ, ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్, టైటాన్, ఇండస్​ఇండ్​ బ్యాంక్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్​, బజాజ్ ఆటో, హెచ్​డీఎఫ్​సీ, ఎస్​బీఐ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి.

ఆసియా మార్కెట్లు

ఆసియా మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. షాంఘై, హాంకాంగ్, టోక్యో, సియోల్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి.

ముడిచమురు

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర స్పల్పంగా తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు 54.36 డాలర్లుగా ఉంది.

రూపాయి

అమెరికన్ డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం 9 పైసలు బలపడింది. ప్రస్తుతం 71.34 వద్ద కొనసాగుతోంది.

ఇదీ చదవండి: కొత్త పన్ను విధానంతో రిటర్నులు మరింత సులభతరం

Last Updated :Feb 29, 2020, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details