తెలంగాణ

telangana

చమురు భయాలతో స్టాక్ మార్కెట్ల ఒడుదొడుకులు

By

Published : Jan 3, 2020, 9:39 AM IST

Updated : Jan 3, 2020, 10:32 AM IST

ఇరాక్​లో అమెరికా రాకెట్​ దాడులతో ముడి చమురు ధరలు నాలుగు శాతం మేర పెరిగాయి. ఈ నేపథ్యంలో చమురు భయాలతో స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 65 పాయింట్లు, నిఫ్టీ 29 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడవుతున్నాయి.

STOCKS
స్టాక్​ మార్కెట్లు

అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా.. ఇరాన్​ జనరల్ లక్ష్యంగా అమెరికా చేసిన రాకెట్ దాడితో చమురు భయాలు పెరిగిపోయాయి. ఈ పరిణామాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 65 పాయింట్లకు పైగా నష్టంతో.. ప్రస్తుతం 41,561 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 29 పాయింట్ల క్షీణతతో 12,252 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివివే..

రిలయన్స్, ఓఎన్​జీసీ, ఎస్​ బ్యాంకు, సన్​ఫార్మా, టాటా మోటార్స్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
ఎన్​టీపీసీ, భారతీ ఎయిర్​టెల్​, ఎం&ఎం, మారుతీ, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి, ముడి చమురు

రూపాయి నేడు 17 పైలసు క్షీణించింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ రూ. 71.56 వద్ద కొనసాగుతోంది.

ముడి చుమురు ధరల సూచీ-బ్రెంట్​ 4.4 శాతం పెరిగి.. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్​ ధర 69.16 డాలర్లుగా ఉంది.

ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లయిన చైనా​, దక్షిణ కొరియా, హాంగ్​కాంగ్​ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. జాపాన్ సూచీ కొత్త సంవత్సర సెలవులలో ఉంది.

ఇదీ చూడండి:కష్టకాలం:20 ఏళ్ల కనిష్ఠానికి వాహన విక్రయాలు

Last Updated : Jan 3, 2020, 10:32 AM IST

ABOUT THE AUTHOR

...view details