తెలంగాణ

telangana

జియోలో మరో విదేశీ సంస్థ పెట్టుబడులు

By

Published : Jul 12, 2020, 11:01 PM IST

Updated : Jul 13, 2020, 6:00 AM IST

జియో ప్లాట్​ఫామ్స్​లో 0.15 శాతం వాటాను దిగ్గజ వైర్​లెస్​ టెక్నాలజీ సంస్థ క్వాల్​కామ్ రూ.730 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు రిలయన్స్​ ఇండస్ట్రీస్​ ​ ప్రకటించింది. తాజా పెట్టుబడితో జియోకు వచ్చిన మొత్తం పెట్టుబడులు రూ. లక్షా 18 వేల కోట్ల మార్క్​ను దాటాయి.

Qualcomm invests
జియోలో మరో విదేశీ సంస్థ పెట్టుబడులు

జియోలోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా వైర్​లెస్​ టెక్నాలజీ దిగ్గజం క్వాల్​కామ్​ సంస్థ.. జియో ప్లాట్​ఫామ్స్​లో 0.15 శాతం వాటాను రూ. 730 కోట్లకు కొనుగోలు చేసినట్లు రిలయన్స్​ ఇండస్ట్రీస్​ ప్రకటించింది.

ఇప్పటి వరకు జియో ప్లాట్​ఫామ్స్​లో పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో క్వాల్​కామ్​ 13వ సంస్థ. తాజా పెట్టుబడితో జియోకు గత ఏప్రిల్​ నుంచి వచ్చిన మొత్తం పెట్టుబడులు రూ.1,18,318.45 కోట్లకు చేరాయి.ఈ పెట్టుబడుల కారణంగా క్వాల్​కామ్​తో ఏర్పడిన బంధం.. జియో అధునాతన 5జీ సేవలకు ఉపయోగడనుందని తెలిపింది సంస్థ.

" క్వాల్​కామ్​ చాలా సంవత్సరాలుగా విలువైన భాగస్వామిగా ఉంది. బలమైన, సురక్షితమైన వైర్​లెస్​, డిజిటల్​ నెట్​వర్క్​ను నిర్మించటం, డిజిటల్​ కనెక్టివిటీ ప్రయోజనాలను భారత్​లో ప్రతిఒక్కరికి అందించే లక్ష్యంతో ఉన్నాం. వైర్​లెస్​ టెక్నాలజీలలో గ్లోబల్ లీడర్​గా ఉన్న క్వాల్​కామ్​ లోతైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తుంది. అది మా 5జీ సేవలను, భారత్​లో ప్రజలను, సంస్థలను డిజిటల్​ విధానంలోకి తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతుంది."

- ముఖేశ్​ అంబానీ, రిలయన్స్​ ఇండస్ట్రీస్​ అధినేత.

జియో ప్రణాళిక..

2021 వరకు సంస్థను రుణరహితంగా మార్చాలని రిలయన్స్ భావిస్తోంది. ఇందులో భాగంగానే జియో వరుస పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇందుకోసం జియోలో 25 శాతం మైనారిటీ వాటాను వాటాదార్లకు విక్రయించాలని నిర్ణయించింది. విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో... జియోలో వాటా విక్రయాల ప్రక్రియ దాదాపు పూర్తయినట్లేనని తెలుస్తోంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలో జియో ప్లాట్​ఫామ్స్ ఉన్నాయి. భారత్​ మార్కెట్​లో 38.8 కోట్ల మంది చందాదారులతో జియో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

క్వాల్​కామ్​తో పాటు జియోలోకి వచ్చిన గత పెట్టుబడులు
Last Updated : Jul 13, 2020, 6:00 AM IST

ABOUT THE AUTHOR

...view details