తెలంగాణ

telangana

ముదిరిన వివాదం.. గవర్నర్‌పై సీఎం తీవ్ర ఆరోపణలు.. ముర్ముకు​ ఫిర్యాదు!

By

Published : Jul 9, 2023, 10:27 PM IST

Updated : Jul 9, 2023, 10:41 PM IST

Tamilnadu Governor VS CM : తమిళనాడు గవర్నర్​ ఆర్​ఎన్​ రవిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఫిర్యాదు చేశారు ముఖ్యమంత్రిపై ఎమ్​కే స్టాలిన్​. తమిళనాడు గవర్నర్‌ ఆర్​ఎన్ రవి ఉన్నత పదవిలో కొనసాగేందుకు అర్హుడు కాదని, ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించాలని సీఎం స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతికి ఓ లేఖ రాశారు.

Tamilnadu Governor VS CM
Tamilnadu Governor VS CM

Tamilnadu Governor VS CM : తమిళనాడు గవర్నర్‌ ఉన్నత పదవిలో కొనసాగేందుకు అర్హుడు కాదని, ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించాలని సీఎం స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఓ లేఖ రాశారు. గవర్నర్‌ ఆర్​ఎన్ రవి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, తమిళనాడులో శాంతిభద్రతలకు ముప్పుగా పరిణమించారని ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శనివారం రాసిన లేఖలో పేర్కొన్నట్లు తమిళనాడు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

"రాజ్యాంగంలోని 159వ అధికరణ ప్రకారం చేసిన ప్రమాణాన్ని గవర్నర్‌ ఆర్​ఎన్ రవి ఉల్లంఘించారు. రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఆయన చర్యల వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉంది" అని ముఖ్యమంత్రి స్టాలిన్ లేఖలో ఆరోపించారు. మంత్రి సెంథిల్‌ బాలాజీని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేసి, తిరిగి ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గడం ద్వారా గవర్నర్‌ తన రాజకీయ వైఖరిని ప్రదర్శించారని సీఎం లేఖలోపేర్కొన్నారు.

మరోవైపు.. గత ఏఐఏడీఎంకే ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతికి సంబంధించి.. ఆ పార్టీ నాయకులపై విచారణ విషయంలో గవర్నర్‌ ఆర్​ఎన్​ రవి ఉదారంగా వ్యవహరిస్తున్నారని స్టాలిన్ ఆరోపించారు. గత కొంత కాలంగా గవర్నర్‌ వ్యవహరిస్తున్న తీరు ఆయన ఈ పదవికి అర్హుడు కాదనే విషయాన్ని స్పష్టం చేస్తోందని లేఖలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తిని పదవిలో కొనసాగించడం ఏ మాత్రం కరెస్ట్​ కాదని, ఆయన్ను గవర్నర్​ పదవి నుంచి తొలగించాలా? వద్దా? అనే నిర్ణయాధికారం రాష్ట్రపతికే వదిలిపెడుతున్నట్లు ముఖ్యమంత్రి లేఖలో పేర్కొన్నారు.

కొద్దిరోజుల క్రితమే మంత్రి బాలాజీని అవినీతి ఆరోపణలతో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టు ఆయనకు జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో సెంథిల్‌ బాలాజీని మంత్రి మండలి నుంచి తొలగిస్తూ గవర్నర్‌ ఆర్​ఎన్ రవి ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. అయితే, గవర్నర్‌ నిర్ణయాన్ని బీజేపీయేతర పార్టీలు ఖండించాయి. అంతకుముందు అసెంబ్లీలో తమిళనాడు, ద్రవిడ మోడల్‌ వంటి పదాలు, ద్రవిడ నాయకుల పేర్లను వదిలేసి గవర్నర్‌ ప్రసంగించడం కూడా వివాదాస్పదమైంది. ఆర్​ఎన్ తీరుపై అధికార డీఎంకే కూటమి పార్టీలు భగ్గుమన్నాయి. ఆయన్ను రీకాల్‌ చేయాలని డిమాండ్‌ చేశాయి.

Last Updated :Jul 9, 2023, 10:41 PM IST

ABOUT THE AUTHOR

...view details