తెలంగాణ

telangana

వారాంతంలో మార్కెట్లకు మళ్లీ నష్టాలు.. సెన్సెక్స్​ 715 మైనస్​

By

Published : Apr 22, 2022, 9:30 AM IST

Updated : Apr 22, 2022, 3:36 PM IST

Stock market live updates
భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

14:56 April 22

Stock Market Close:రెండు వరుస సెషన్ల భారీ లాభాల అనంతరం.. స్టాక్​ మార్కెట్లు వారాంతంలో నష్టపోయాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ 715 పాయింట్లు పడిపోయింది. చివరకు 57 వేల 197 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 221 పాయింట్లు కోల్పోయి.. 17 వేల 172 వద్ద సెషన్​ను ముగించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు.. దేశీయ సూచీలను కోలుకోనివ్వకుండా చేశాయి. ఆసియా, అమెరికా, ఐరోపా మార్కెట్లు కూడా అన్నీ ప్రతికూలంగానే ట్రేడయ్యాయి.

సెన్సెక్స్​ ఓ దశలో 770 పాయింట్లకుపైగా పతనంతో 57 వేల 135 వద్ద సెషన్​ కనిష్ఠాన్ని తాకింది. తొలుత దాదాపు 400 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్​ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. లోహం, ఆర్థిక రంగం షేర్లు కుదేలయ్యాయి. విద్యుత్​ షేర్లు మినహా దాదాపు అన్నీ డీలాపడ్డాయి. ఆఖరి గంటలో అమ్మకాలతో మార్కెట్ల నష్టాలు మరింత పెరిగాయి. అదానీ పోర్ట్స్​, ఎం అండ్​ ఎం, మారుతీ సుజుకీ, హెచ్​సీఎల్​ టెక్​, ఐటీసీ లాభపడ్డాయి. హిందాల్కో, సిప్లా, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ లైఫ్​, డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్స్​ నష్టపోయాయి. సెన్సెక్స్​ గత సెషన్​లో 874 పాయింట్లు, నిఫ్టీ 256 పాయింట్లు పెరగడం విశేషం.

ఇవీ చూడండి:క్రెడిట్, డెబిట్​ కార్డ్స్​కు కొత్త రూల్స్.. అలా జరిగితే కస్టమర్​కు రోజుకు రూ.500!

09:26 April 22

వారాంతంలో మార్కెట్లకు మళ్లీ నష్టాలు.. సెన్సెక్స్​ 715 మైనస్​

Stock Market: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. గత రెండు రోజుల వరుస లాభాల నేపథ్యంలో మదుపర్లు కీలక రంగాల్లో లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు అమెరికా మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. ద్రవ్యోల్బణ కట్టడికి వడ్డీరేట్లను అత్యంత వేగంగా పెంచనున్నట్లు ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ తెలిపారు. నేడు ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు ప్రతికూలంగా పయనిస్తున్నాయి.

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 613 పాయింట్ల నష్టంతో 57,298 వద్ద, నిఫ్టీ 184 పాయింట్లు నష్టపోయి 17,208 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.29 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఎంఅండ్‌ఎం, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, మారుతీ, నెస్లే ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ షేర్లు నష్టపోతున్న వాటిలో ఉన్నాయి.

Last Updated :Apr 22, 2022, 3:36 PM IST

ABOUT THE AUTHOR

...view details