తెలంగాణ

telangana

అమరావతిలో ఘోర ప్రమాదం.. భవనం కూలి ఐదుగురు మృతి

By

Published : Oct 30, 2022, 4:36 PM IST

Updated : Oct 30, 2022, 4:53 PM IST

మహారాష్ట్ర అమరావతిలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రభాత్​ చౌక్​లో ఉన్న పురాతన భవనం కూలి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.

amravati building collapse
amravati building collapse

మహారాష్ట్ర అమరావతిలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రభాత్​ చౌక్​లో ఉన్న పురాతన భవనం కూలి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో జరిగిందని అధికారులు చెప్పారు. శిథిలాల కింద చిక్కుకున్న రెండు మృతదేహాలను వెలికితీశామని తెలిపారు.

అమరావతి ఎంపీ నవనీత్ కౌర్​ సైతం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. భవనం కూలిపోయే స్థితికి చేరుకుందని.. వెంటనే ఖాళీ చేయాలని కోరినా పట్టించుకోలేదని మున్సిపల్​ అధికారులు తెలిపారు. గత ఏడేళ్లుగా నోటీసులు అనేక సార్లు నోటీసులు జారీ చేసినా.. కఠిన చర్యలు తీసుకోలేదని స్థానికులు వాపోయారు.

Last Updated : Oct 30, 2022, 4:53 PM IST

ABOUT THE AUTHOR

...view details