తెలంగాణ

telangana

'నేతాజీ విగ్రహం.. భావితరాలకు స్ఫూర్తి'

By

Published : Jan 23, 2022, 6:37 PM IST

Updated : Jan 23, 2022, 7:41 PM IST

Netaji hologram statue India Gate: ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్ర బోస్ హాలోగ్రామ్​ విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నేతాజీ 125వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. నేతాజీ విగ్రహం.. ప్రజాస్వామ్య విలువల్ని గుర్తుచేస్తూ, భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు.

PM Modi unveils Netaji's hologram statue at India Gate
నేతాజీ విగ్రహం, ప్రధాని మోదీ

Netaji hologram statue India Gate: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించింది కేంద్రం. దిల్లీలోని ఇండియా గేట్​ వద్ద అబ్బురపరిచే నేతాజీ హాలోగ్రామ్​( బీమ్​ లైట్లతో ఏర్పాటు చేసే 3డీ చిత్రం) విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆ స్థానంలో గ్రానైట్​తో తయారు చేసే విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.

నేతాజీకి భారత్​ రుణపడి ఉంటుందని, ఇందుకు విగ్రహమే తార్కాణమని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పూర్తిస్థాయి విగ్రహం రూపొందే వరకు ఈ ప్రదేశంలో నేతాజీ హాలోగ్రామ్ విగ్రహం ఉంటుందని మోదీ తెలిపారు.

" స్వాతంత్య్రం పోరాడి సాధించాలి.. అభ్యర్థించేది కాదని నేతాజీ అనేవారు. బ్రిటిషర్లకు తలొగ్గడాన్ని ఆయన ఎప్పుడూ తిరస్కరించేవారు. త్వరలోనే హాలోగ్రామ్​ విగ్రహం స్థానంలో గ్రానైట్​ విగ్రహం ఏర్పాటు చేస్తాం. నేతాజీ విగ్రహం.. ప్రజాస్వామ్య విలువలను గుర్తు చేస్తుంది. భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. స్వతంత్ర భారతావనిని తీసుకువచ్చే ఆకాంక్షను ఎప్పటికీ కోల్పోవద్దని, భారత్​ను కదిలించే శక్తి ఎవరికీ లేదని నేతాజీ చెప్పేవారు. స్వతంత్ర భారత్​ కలలను సాకారం చేయటమే మన ముందు ఉన్న లక్ష్యం. 100వ స్వాతంత్య్ర దినోత్సవంలోపు నవ భారత్​ను రూపొందించాలి. నేతాజీ సుభాష్​ చంద్రబోస్​కు సంబంధించిన రహస్య దస్త్రాలను బయటపెట్టే అవకాశం మా ప్రభుత్వానికి లభించటం అదృష్టంగా భావిస్తున్నా. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

అనంతరం 2019, 2020, 2021, 2022 ఏడాదికి గాను సుభాష్ చంద్ర బోస్​ అప్డా ప్రబంధన్​ పురస్కారాలను ప్రదానం చేశారు మోదీ.

బోస్​ పురస్కారాలు ప్రదానం చేస్తున్న మోదీ

గతంలో విపత్తు నిర్వహణను వ్యవసాయ శాఖ చూసుకునేదని.. తమ ప్రభుత్వం ఎన్​డీఆర్​ఎఫ్​ను బలోపేతం చేసిందని తెలిపారు మోదీ. విపత్తు నిర్వహణ రంగంలో చేపట్టిన సంస్కరణలను అంతర్జాతీయ సంస్థలు ప్రశంసించినట్లు గుర్తు చేశారు. ఎన్​డీఆర్​ఎఫ్​ను ఆధునికీకరించి.. దేశవ్యాప్తంగా విస్తరించామన్నారు. స్పేస్​ టెక్నాలజీ వంటి అన్ని విధానాలను తీసుకొచ్చామని తెలిపారు. దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​ సిబ్బందికి నివాళులర్పించారు మోదీ.

​'సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:ఆంగ్లేయుల నయవంచనకు మౌన సాక్ష్యం 'ఇండియా గేట్

Last Updated :Jan 23, 2022, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details