తెలంగాణ

telangana

గ్రాండ్​గా కుక్క బర్త్​డే పార్టీ.. 100కేజీల కేక్​ కటింగ్.. ఐదు వేల మందికి భోజనాలు

By

Published : Jun 23, 2022, 6:30 PM IST

pet dog birthday Belagavi

కర్ణాటకలో ఓ పెంపుడు శునకానికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఓ యజమాని. ఏకంగా 100 కేజీల కేక్​ను కట్​ చేశారు. అలాగే 5,000 మందికి భోజనాలు పెట్టారు. ఇంత ఘనంగా వేడుకలు చేయడం వెనుక ఓ పెద్ద పొలిటికల్ కథ ఉందట. అదేంటో తెలుసుకుందామా?

పెంపుడు కుక్కలపై యజమానులకు ప్రేమ సహజమే. వాటిని ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటారు. కొందరు సరదాగా బర్త్​డే పార్టీలు కూడా చేస్తుంటారు. కానీ కర్ణాటకకు చెందిన వ్యక్తి ఓ వ్యక్తి మాత్రం అవమానకర వ్యాఖ్యలకు సమాధానంగా కుక్క పుట్టిన రోజు సంబరాలు ఘనంగా నిర్వహించాడు.

పెంపుడు కుక్కతో 100 కేజీల కేక్ కట్ చేయిస్తున్న యజమాని శివప్ప
బెళగావి జిల్లా తుక్కనట్టి గ్రామానికి చెందిన శివప్ప మర్డి ఈ పెంపుడు కుక్క 'క్రిష్​'కు యజమాని. క్రిష్​ పుట్టిన రోజు వేడుకలకు గ్రామంలోని 5,000 మందిని పిలిచాడు. 100 కిలోల కేక్​ను కట్​ చేశాడు. పసందైన విందును గ్రామస్థులకు ఏర్పాటు చేశాడు. 300 కేజీల మాంసం, 100 కేజీల గుడ్లను అతిథులకు వండిపెట్టారు. శాకాహారులకు 50 కేజీల కూరగాయల భోజనాన్ని ఏర్పాటు చేశాడు. అనంతరం పెంపుడు కుక్క క్రిష్​ను​ ఘనంగా ఊరేగించారు.
విందు బోజనాలు చేస్తున్న గ్రామస్థులు
శివప్ప మర్డి గత 20 ఏళ్లుగా గ్రామ పంచాయతీ సభ్యుడు. ఓ సారి కొత్త పంచాయతీ సభ్యుడు తన పుట్టిన రోజు వేడుకల్లో పాత పంచాయతీ సభ్యులపై అవమానకరంగా వ్యాఖ్యలు చేశాడు. తమ ప్రభుత్వ హయాంలో పాత పంచాయతీ సభ్యులు కుక్కల్లా తిన్నారని కించపరిచాడు. ఈ సభ్యుడి వ్యాఖ్యలకు నిరసనగా శివప్ప తన పెంపుడు కుక్కకు ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాడు.
పెంపుడు కుక్క క్రిష్ బర్త్​డే సందర్భంగా 100 కేజీల కేక్

ABOUT THE AUTHOR

...view details