ETV Bharat / bharat

ఫంక్షన్​కు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం- ముగ్గురు పిల్లలు సహా 9మంది స్పాట్​ డెడ్​- 23మందికి గాయాలు - Road Accident

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 29, 2024, 7:22 AM IST

Updated : Apr 29, 2024, 8:12 AM IST

Chhattisgarh Road Accident News Today
Chhattisgarh Road Accident News Today

Chhattisgarh Road Accident News Today : మినీ ట్రక్కును సరుకు రవాణా వాహనం ఢీకొట్టడం వల్ల 9 మంది అక్కడికక్కడే మరణించారు. 22 మంది గాయపడ్డారు. ఛత్తీస్​గఢ్​లో జరిగిందీ ఘటన.

Chhattisgarh Road Accident News Today : ఛత్తీస్​గఢ్​లోని బెమెతర జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు. 23 మంది గాయపడ్డారు. మినీ ట్రక్కును సరుకు రవాణా వాహనం ఢీకొనడం వల్ల ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. మృతులను పాతర్రా గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని తిరయ్య గ్రామంలో జరిగిన శుభకార్యానికి వెళ్లిన బాధితులు ఆదివారం రాత్రి తిరుగుపయనమయ్యారు. వారు ప్రయాణిస్తున్న మినీ ట్రక్కును కథియా గ్రామ సమీపంలో రోడ్డు పక్కన డ్రైవర్ ఆపారు. ఇంతలో ఓ సరకు వాహనం వచ్చి మినీ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే తొమ్మిది మంది మరణించారు.

మృతులను భూరి నిషాద్ (50), నీరా సాహు (55), గీతా సాహు (60), అగ్నియా సాహు (60), ఖుష్భూ సాహు (39), మధు సాహు (5), రికేశ్ నిషాద్ (6), ట్వింకిల్ నిషాద్ (6)గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని రాయ్​పుర్​ ఆస్పత్రిలో చేర్పించారు.

కొన్నిరోజుల క్రితం, రాజస్థాన్​లో ఝలావర్​ జిల్లాలోని అకలేరాలో అతి వేగంగా వచ్చిన ఓ ట్రాలీ అదుపు తప్పి వ్యాన్​ను ఢీకొట్టిన ఘటనలో 9 మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్​లో ఓ వివాహ వేడకకు హాజరయ్యే తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా అకలేరా సమీపంలోని దుంగార్ గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. ఆ గ్రామానికి చెందిన కొంతమంది తమ బంధువుల వివాహ వేడుక కోసం శనివారం మధ్యప్రదేశ్​కు వెళ్లారని, తిరిగి వస్తుండగా ట్రాలీ ఢీ కొట్టిందని పేర్కొన్నారు.

అదే రోజు ఉత్తర్​పద్రేశ్​లోని సోన్​భద్ర జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు వ్యక్తులపైకి లారీ దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపార్ట్​మెంట్​లో భారీ అగ్నిప్రమాదం - 5వ అంతస్థులోని ఇల్లు దగ్ధం - తప్పిన ప్రాణనష్టం - Alwal fire accident

కారు, ట్రక్కు ఢీ- 10మంది మృతి- ఎక్స్​ప్రెస్​వేపై ఘోర ప్రమాదం - GUJARAT ACCIDENT TODAY

Last Updated :Apr 29, 2024, 8:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.