మహిళ తాకితే స్పృహ కోల్పోతున్న పూజారి.. అదే కారణమా?

author img

By

Published : Jun 23, 2022, 12:20 PM IST

priest disorder

మహిళ స్పర్శ తగిలితే చాలు.. మూర్ఛపోతుండాట ఓ పూజారి. హనుమాన్ భక్తుడిని కావడం వల్లే తనకు ఇలా జరుగుతుందని అంటున్నాడు. విసుగు చెందిన కొందరు భక్తులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా నర్సు తాకడం వల్ల అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు!. కానీ ఆ తర్వాతే అసలు విషయం బయటపడింది. అసలేం జరిగిందంటే?

మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఆలయానికి వచ్చిన మహిళలను తాకితే స్పృహా కోల్పోతానని దూరం పెడుతున్నాడు హనుమాన్ గుడి పూజారి. ఎందుకని అడిగితే.. తాను హనుమాన్​ పరమ భక్తుడిని.. అందుకే ఆడవారిని తాకితే కళ్లు తిరిగి పడిపోతానని చెప్పేవాడు. దీంతో విసుగు చెందిన కొందరు భక్తులు.. స్థానికంగా ఉన్న సైకియాట్రిస్ట్​ దగ్గరకు అతడ్ని తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించాక అక్కడ అసలు విషయం బయటపడింది.

priest disorder
పూజారి

ఆసుపత్రికి వచ్చిన పూజారిని జేపీ ఆసుపత్రి సైకియాట్రిస్ట్​​ డా.ఆర్​.కె.బైరాగి వివిధ రకాల పరీక్షలను నిర్వహించారు. వాటి నివేదికలను పరిశీలించి అన్నీ సరిగ్గానే ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ తర్వాత కాస్త ఆలోచించిన డాక్టర్​.. పూజారికి చిన్న పరీక్ష పెట్టారు. 'మహిళా నర్సు నిన్ను తాకుతుంది. నువ్వు స్పృహా కోల్పోతావో లేదో చూద్దాం' అని డాక్టర్​.. పూజారితో చెప్పాడు. కానీ మహిళా నర్సుతో కాకుండా, ఆఫీస్​ బాయ్​తో తాకించాడు డాక్టర్​. అది తెలియని ఆ పూజారి మాత్రం కళ్లు తిరిగి పడిపోయాడు. పూజారి స్పృహలోకి వచ్చాక డాక్టర్​ జరిగినదంతా చెప్పాడు. దీని తర్వాత వైద్యులు.. చికిత్సను ప్రారంభించారు.

priest disorder
ఆడవారి బదులు మగవారితో టచ్ చేయిస్తున్న దృశ్యం
priest disorderpriest disorder
స్పృహ తప్పి పడిపోయిన పూజారి

"ఇది ఒక రకమైన మానసిక రుగ్మత వ్యాధి. కొందరు తనను తాను అమితాబ్​ బచ్చన్​లా ఊహించుకుంటుూ నటిస్తారు. కొందరు మంచి డ్యాన్సర్​ అనుకుంటూ నృత్యం చేస్తారు. అదే విధంగా, ఈ పూజారి కూడా తనలో భగవంతుడి శక్తి ఉందని భావిస్తున్నాడు. అందుకే ఇలా చేస్తున్నాడు. ప్రస్తుతం పూజారికి చికిత్స అందిస్తున్నాం."

-- డా.ఆర్​.కె. బైరాగి, మానసిక వ్యాధి నిపుణులు

పూజారికి కొద్దిరోజులుగా కౌన్సిలింగ్​ ఇస్తున్నామని చెప్పారు వైద్యులు బైరాగి. దాంతో పాటు వైద్యం అందిస్తున్నామని కూడా తెలిపారు. వీరిని సైకోపత్ ​అని​ అనొచ్చని, ఇలాంటి వారు అనేకమంది ఉన్నారన్నారు. వారికి కూడా వైద్యంతో పాటు కౌన్సిలింగ్​ అందిస్తే సరిపోతుందని డాక్టర్​ బైరాగి చెప్పారు.

ఇవీ చదవండి: 'మహా' సంక్షోభం.. శిందేకు పెరుగుతున్న బలం.. అసోంలోనే మకాం!

యువకుడి హత్య.. రాళ్లతో నిందితులను కొట్టి చంపిన గ్రామస్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.