తెలంగాణ

telangana

Narendra Modi ISRO : 'చంద్రయాన్-3 దిగిన ప్రాంతానికి 'శివశక్తి' పేరు.. అంతరిక్ష దినోత్సవంగా ఆగస్టు 23'

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2023, 8:44 AM IST

Updated : Aug 26, 2023, 9:32 AM IST

Narendra Modi ISRO : చంద్రుడిపై చంద్రయాన్​-3 ల్యాండింగ్​ అయిన ప్రదేశానికి 'శివశక్తి'గా పేరు పెట్టనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. చంద్రయాన్​-2 దిగిన ప్రాంతాన్ని తిరంగా పాయింట్​గా పిలవనున్నట్లు చెప్పారు. బెంగళూరులోని ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్‌ చేస్తున్నట్లు భావోద్వేగానికి గురయ్యారు.

Narendra Modi ISRO
Narendra Modi ISRO

Narendra Modi ISRO : జాబిల్లిపై చంద్రయాన్​-3దిగిన ప్రదేశాన్ని 'శివశక్తి' అని పేరు పెట్టనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 2019లో చంద్రయాన్​-2 దిగిన ప్రాంతాన్ని తిరంగా పాయింట్​గా పిలవనున్నట్లు మోదీ అన్నారు. చంద్రుడిపై ల్యాండర్ దిగిన ఆగస్టు 23ను అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోనున్నట్లు చెప్పారు. బెంగళూరులోని ఇస్రో కార్యాలయాన్ని సందర్శించిన ఆయన.. చంద్రయాన్‌-3ద్వారా అసాధారణ విజయం నమోదు చేశామని పేర్కొన్నారు. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్‌ చేస్తున్నట్లు భావోద్వేగానికి గురయ్యారు.

మన దేశ సత్తా ఏమిటో ప్రపంచానికి చాటాం : మోదీ
PM Modi Visits ISRO : "ఇస్రో సాధించిన విజయం చాలా గర్వకారణం. చంద్రుడిపై భారత్‌ అడుగుపెట్టింది. అంతరిక్ష చరిత్రలో సరికొత్త చరిత్రను భారత్‌ సృష్టించింది. ఇప్పుడు చంద్రుడిపై భారత్​ ఉంది. మన దేశ సత్తా ఏమిటో ప్రపంచానికి చాటాం. ప్రపంచంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపగలమని నిరూపించాం. గతంలో ఎవరూ చేయలేనిది ఇప్పుడు ఇస్రో చేసి చూపించింది" అంటూ మోదీ చెప్పుకొచ్చారు.

'ఇంటిపైనే కాదు.. చంద్రుడిపైనా మన జెండా..'
Modi Visit To Bangalore : "ఇస్రో సాధించిన విజయం ఎన్నో దేశాలకు స్ఫూర్తినిస్తుంది. ఇస్రో శాస్త్రవేత్తలు, సాంకేతికత వైపు ప్రపంచం చూస్తోంది. చంద్రయాన్‌-3 కృషిలో మహిళా శాస్త్రవేత్తలు ఉండటం గర్వకారణం. మన నారీ శక్తి ఏమిటో ప్రపంచానికి మరోసారి చాటాం. చంద్రయాన్‌-2 వైఫల్యంతో మనం వెనకడుగు వేయలేదు. మరింత పట్టుదలతో పనిచేసి చంద్రయాన్‌-3 విజయం సాధించాం. ఇప్పుడు ప్రతి ఇంటిపైనే కాదు.. చంద్రుడిపైనా త్రివర్ణ పతాకం ఎగురుతోంది" అని మోదీ తెలిపారు.

Chandrayaan 3 : జాబిల్లిపై 14 రోజులపాటు విక్రమ్, ప్రగ్యాన్​.. అక్కడ అసలు ఏం చేస్తాయి?

ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం
Modi Visit ISRO : "'మేకిన్‌ ఇండియా' ఇప్పుడు చంద్రుడి వరకు సాగింది. మంగళ్‌యాన్‌, చంద్రయాన్‌విజయం స్ఫూర్తిని కొనసాగిద్దాం. ఈ విజయాల స్ఫూర్తితో గగన్‌యాన్‌కు సిద్ధమవుదాం. అంతరిక్ష విజ్ఞానంతో ఎన్నో ఫలితాలు అందుకోవాలి. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో ఈ విజ్ఞానం ఉపయోగపడాలి. తుపానులను అంచనా వేయడం వల్ల మరింత నైపుణ్యం సాధించాలి. వాతావరణ మార్పులను మరింత కచ్చితంగా తెలుసుకోవాలి" అని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.

మోదీకి ప్రయోగం తీరును వివరించిన సోమనాథ్​
Modi Visit To ISRO : చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు.. విదేశీ పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ నేరుగా బెంగళూరుకు వచ్చారు. విమానాశ్రయం వద్దకు వచ్చిన అభిమానులకు మోదీ అభివాదం చేశారు. అక్కడి నుంచి నేరుగా ఇస్రో కేంద్రానికి వెళ్లి.. శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ సందర్భంగా చంద్రయాన్‌-3 ప్రయోగం తీరును ప్రధానికి ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ వివరించారు.

Last Updated :Aug 26, 2023, 9:32 AM IST

ABOUT THE AUTHOR

...view details