తెలంగాణ

telangana

'ప్రజలు మాస్కులు వేసుకోవట్లేదు.. ఇలా ఉంటే కష్టమే'

By

Published : Dec 10, 2021, 6:05 PM IST

Ministry of Health on Omicron: భారతదేశంలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ కేసుల్లో చాలా మందిలో తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలోని 19 జిల్లాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు 10శాతానికి చేరిందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ministry of health
ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Omicron Cases in India: భారతదేశంలో ఇప్పటివరకు 25 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రాజస్థాన్‌లో తొమ్మిది, గుజరాత్‌లో మూడు, మహారాష్ట్రలో 10, కర్ణాటకలో రెండు, దిల్లీలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయని వివరించింది. అయితే వీరందరిలో అత్యంత స్వల్ప లక్షణాలే ఉన్నట్లు పేర్కొంది.

Omicron Variant Symptoms: ఈ వేరియంట్​తో ఆరోగ్య వ్యవస్థపై ఇంకా భారం పడలేదని.. అయితే అప్రమత్తంగా ఉండటం ముఖ్యమని అభిప్రాయపడింది. మహమ్మారి విజృంభణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఐసీఎంఆర్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో పలు అంశాలను వెల్లడించింది.

  • దేశంలోని 19 జిల్లాల్లో వారం వ్యవధిలోనే కొవిడ్ పాజిటివిటీ 5 నుంచి 10 శాతం పెరిగింది. మూడు రాష్ట్రాల్లోని ఎనిమిది జిల్లాల్లో ఇది 10 శాతానికి పైగా ఉంది.
  • 5% కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు ఉన్న చోట జిల్లా స్థాయి ఆంక్షలు విధించాలి.
  • 18ఏళ్లు పైబడిన వారిలో 86.2 శాతం మందికి కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు పూర్తి కాగా.. 53.5 శాతం మంది రెండు డోసులను అందుకున్నారు.

Mask Usage in India: మాస్క్ వినియోగంలో అశ్రద్ధ చూపొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) హెచ్చరించిందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు.

"చాలావరకు మాస్కుల వాడకం తగ్గుతోంది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో టీకాలు, మాస్క్‌లు రెండూ ముఖ్యం అని గుర్తుంచుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి."

---డాక్టర్ వీకే పాల్, నీతి ఆయోగ్

Pediatric Vaccine in India: పిల్లలకు టీకా పంపిణీపై నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ (ఎన్​టీఏజీఐ) నుంచి ప్రభుత్వానికి ఎటువంటి ప్రతిపాదన అందలేదని వీకే పాల్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details