తెలంగాణ

telangana

రూ.200 కోట్ల డ్రగ్స్​తో భారత్​లోకి పాక్ పడవ.. ఆరుగురు అరెస్ట్

By

Published : Sep 14, 2022, 11:27 AM IST

Updated : Sep 14, 2022, 12:44 PM IST

పాకిస్థాన్​ నుంచి భారత్​లోకి బోటు ద్వారా తరలిస్తున్న రూ.200 కోట్ల విలువైన డ్రగ్స్​ను గుజరాత్​ ఉగ్రవాద నిరోధక దళం పట్టుకుంది. వెంటనే బోటును సీజ్​ చేసి ఆరుగురు పాకిస్థానీలను అరెస్ట్ చేసింది.

apprehended a Pakistani boat with 40 kgs of drugs valued at Rs 200 cr
apprehended a Pakistani boat with 40 kgs of drugs valued at Rs 200 cr

పాకిస్థాన్‌ నుంచి భారత్​లోకి తరలిస్తున్న రూ.200 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను గుజరాత్‌ ఉగ్రవాద నిరోధక దళం పట్టుకుంది. అరేబియా మహాసముద్రంలో బోటు ద్వారా తరలిస్తున్న 40 కిలోల హెరాయిన్‌ను గుజరాత్‌ ఉగ్రవాద నిరోధక దళం, కోస్టుగార్డు సిబ్బంది సంయుక్త ఆపరేషన్‌లో పట్టుకున్నాయి. ఈ ఘటనలో బోటును సీజ్‌ చేయడం సహా ఆరుగురు పాకిస్థానీలను అరెస్టు చేశారు.

రూ.200 కోట్ల డ్రగ్స్​తో భారత్​లోకి పాక్ పడవ
పట్టుబడిన డ్రగ్స్​తో అధికారులు

పంజాబ్​కు తరలించేందుకు..
కచ్‌ జిల్లా జకావ్‌ ఓడరేవు సమీపంలోని సముద్రంలో చేపలు పట్టే పడవ ద్వారా హెరాయిన్‌ తరలిస్తున్నట్లు కోస్టుగార్డు, ఏటీఎస్​ సిబ్బంది గుర్తించారు. వెంటనే సంయుక్త ఆపరేషన్‌ చేపట్టి దుండగులను పట్టుకున్నారు. మాదకద్రవ్యాలను గుజరాత్‌ తీరానికి చేర్చి.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో పంజాబ్‌ తరలించాలని పథక రచన చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Last Updated :Sep 14, 2022, 12:44 PM IST

ABOUT THE AUTHOR

...view details