ETV Bharat / bharat

జూన్ 1న 'ఇండియా' కూటమి సమావేశం- ఎజెండా అదే! మమత రెస్పాన్స్​పై సస్పెన్స్! - LOK SABHA ELECTIONS 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 27, 2024, 2:55 PM IST

INDIA Alliance Meet On Poll Performance : విపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు జూన్ 1న మధ్యాహ్నం దిల్లీలో సమావేశం కానున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో కూటమిలోని పార్టీలు కనబర్చిన పనితీరును, ఫలితాలపై సమీక్షించుకునేందుకు ఈ భేటీని నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మీటింగ్‌కు హాజరుకావాలంటూ అన్ని పార్టీలకు ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సూచించినట్లు తెలుస్తోంది.

INDIA Alliance Meet On Polls performance
INDIA Alliance Meet On Polls performance (ANI)

INDIA Alliance Meet On Poll Performance : విపక్ష ఇండియా కూటమిలోని పార్టీల ముఖ్య నేతలు జూన్ 1న(శనివారం) మధ్యాహ్నం దిల్లీలో సమావేశం కానున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కూటమిలోని పార్టీలు కనబర్చిన పనితీరును సమీక్షించుకునేందుకు ఈ భేటీని నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తుది విడత పోలింగ్ జరుగుతున్న జూన్ 1వ తేదీనే ఇండియా కూటమి పార్టీలు నిర్వహిస్తున్న ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం ఉందని పరిశీలకులు అంటున్నారు. మీటింగ్‌కు హాజరుకావాలంటూ అన్ని పార్టీలకు ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సందేశాన్ని పంపారని తెలిసింది. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. ఆ తేదీకి సరిగ్గా మూడు రోజుల ముందు జరుగుతున్న ఇండియా కూటమి సమావేశంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది.

కేజ్రీవాల్ సరెండర్‌కు ఒకరోజు ముందు
ఏడు విడతల పోలింగ్‌ ఘట్టంపై ఇండియా కూటమి పార్టీలు పెట్టుకున్న అంచనాలు ఏమిటి ? అనే దానిపై జూన్ 1న మీటింగ్‌ వేదికగా ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ఏ పార్టీలు హాజరవుతాయి? ఏవి హాజరుకావు? అనేది కూడా వేచిచూడాలి. ప్రత్యేకించి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలకు దూరంగా ఉండిపోయిన మమతా బెనర్జీ ఈ కీలక సమావేశానికి హాజరవుతారా, లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2న తీహాడ్ జైలు అధికారుల ఎదుట లొంగిపోనున్నారు. ఇది జరగడానికి సరిగ్గా ఒకరోజు ముందే ఇండియా కూటమి మిత్రపక్షాలు భేటీ అవుతుండటం గమనార్హం.

ఇక ఈ సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ సహా కూటమిలోని అన్ని పార్టీల అగ్రనేతలు హాజరవుతారని సమాచారం. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 272 లోక్‌సభ సీట్లను ఇండియా కూటమి అవలీలగా గెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. ఈ ఆశాభావంతోనే ఇప్పుడు జూన్ 1 సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.

'5 రోజుల్లో దేశంలోకి రుతుపవనాలు!'- IMD గుడ్​ న్యూస్

పుణె రాష్​ డ్రైవింగ్ కేసులో మరో ట్విస్ట్- బ్లడ్‌ శాంపిల్​ను మార్చేసిన ఫోరెన్సిక్ వైద్యులు అరెస్ట్- డాక్టర్లను కొన్నారా?​ - Pune Porsche Accident

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.