తెలంగాణ

telangana

దేశంలో 287 రోజుల కనిష్ఠానికి కరోనా కొత్త కేసులు

By

Published : Nov 16, 2021, 9:36 AM IST

దేశం​లో కొత్తగా 8,865 మందికి కరోనా (Coronavirus India) సోకింది. వైరస్​ కారణంగా మరో 197 మంది ప్రాణాలు కోల్పోయారు.

Corona cases in India
దేశంలో కరోనా కేసులు

భారత్​లో కరోనా(Coronavirus India) వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 8,865 మంది వైరస్ బారిన పడినట్లు (Corona cases in India) తేలింది. ఇది 287 రోజుల కనిష్ఠం కావడం గమనార్హం. కరోనా(Coronavirus India)​ ధాటికి మరో 197 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 11,971 మంది వైరస్​ను జయించారు.

  • మొత్తం కేసులు:34,456,401
  • మొత్తం మరణాలు:4,63,852
  • యాక్టివ్​ కేసులు:1,30,793
  • కోలుకున్నవారు:3,38,61,756

పరీక్షలు

దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే11,07,617 నమూనాలను పరీక్షించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 62,57,74,159కి చేరినట్లు చెప్పింది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ(coronavirus worldwide) కొనసాగుతూనే ఉంది. కొత్తగా 406,235 మందికి కొవిడ్​​ (Corona update) సోకింది. కరోనా​ ధాటికి మరో 5,315 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 254,536,544కు చేరగా.. మొత్తం మరణాల సంఖ్య 5,121,468కి పెరిగింది.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

దేశం కొత్త కేసులు
అమెరికా 70,823
బ్రిటన్​ 39,705
రష్యా 38,420
ఫ్రాన్స్​ 3,241
జర్మనీ 30,483
ఇటలీ 5,144

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details