తెలంగాణ

telangana

ఎమ్మెల్యే అల్లుడి కారు బీభత్సం- ఆరుగురు బలి

By

Published : Aug 12, 2022, 8:18 AM IST

gujarat accident news
ఎమ్మెల్యే అల్లుడి కారు బీభత్సం

ఓ ఎస్​యూవీ అతి వేగంగా దూసుకెళ్లి ఆటో, బైక్​ను ఢీకొట్టగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గుజరాత్ ఆనంద్ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగింది.

అతి వేగం ఆరుగుర్ని బలిగొంది. గుజరాత్ ఆనంద్ జిల్లా సోజిత్రా గ్రామం దగ్గర్లో గురువారం సాయంత్రం జరిగిందీ ఘటన. ఆనంద్​, తారాపుర్​ను కలిపే రాష్ట్ర రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ ఎస్​యూవీ.. ఆటోను, బైక్​ను ఢీకొట్టింది. ఆటోలో ఉన్న నలుగురు, బైక్​పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలేసి డ్రైవర్ పారిపోయాడు. చికిత్స కోసమని ఓ ఆస్పత్రిలో చేరాడు.

తీవ్రంగా దెబ్బతిన్న కారు ముందు భాగం

సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతులంతా సోజిత్రా, బొరియావీ గ్రామాల ప్రజలని నిర్ధరించారు. గుజరాత్​లో ఓ కాంగ్రెస్​ ఎమ్మెల్యే అల్లుడైన కేతన్​ పదియార్​.. ఎస్​యూవీని వేగంగా నడిపి ఈ ప్రమాదానికి కారణమయ్యాడని ప్రాథమికంగా తేల్చారు. కాసేపటికే కేతన్​ను అరెస్టు చేశారు. ఆరుగురు మరణానికి కారణమయ్యాడని ఐపీసీ సెక్షన్​ 304 కింద కేసు నమోదు చేశారు.

ప్రమాదానికి గురైన ఆటో
ప్రమాదానికి గురైన బైక్
దెబ్బతిన్న కారు ముందు భాగం
కారు లోపల ఎమ్మెల్యే బోర్డ్

ABOUT THE AUTHOR

...view details