పెళ్లి జరిగిన మూడో రోజుకే ఓ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దుర్ఘటన తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా బలవంతంగా వివాహం జరిపించడమే ఆమె ఆత్మహత్యకు కారణమని తేలింది.
ఇష్టం లేకపోయినా..
వెల్లూరులోని ముత్తుమండపం ప్రాంతానికి చెందిన (21) ఏళ్ల భువనేశ్వరి నర్సింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. ఈనెల 15న ఆమెకు రాణిపెట్టాయ్ జిల్లా కావేరిపక్కంకు చెందిన మణికందన్తో వివాహమైంది. ఈ నేపథ్యంలో బుధవారం యువతి ఆమె ఇంటికి వెళ్లాల్సి ఉండగా.. తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.