తెలంగాణ

telangana

టీఎంసీ వర్గాల మధ్య ఘర్షణ.. బాంబులతో దాడి చేసుకుని..

By

Published : Nov 23, 2021, 9:00 PM IST

Updated : Nov 23, 2021, 9:46 PM IST

clashes

బంగాల్​లోని గారా పదుమ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు టీఎంసీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. బాంబులు, రాళ్లతో ప్రజలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు.

టీఎంసీ వర్గాల మధ్య హింసాత్మక ఘటన

బంగాల్​ బీర్​భుమ్​ జిల్లాలో రెండు టీఎంసీ వర్గాల మధ్య భీకర ఘర్షణ జరిగింది. గారా పదుమ గ్రామంలో బాంబులు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘర్షణల్లో తుపాకీలు కూడా వినియోగించారు.

ఓ ప్రభుత్వ ఇళ్ల పథకం సర్వే కోసం బ్లాక్​ డెవలప్​మెంట్​ ఆఫీసర్స్​ బృందం.. గ్రామాన్ని సందర్శించిన నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు.. పరిస్థితిని అదుపు చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఏడుగురిని అరెస్ట్​ చేశారు.

ఈ వ్యవహారంపై టీఎంసీ స్పందించింది. వ్యక్తిగత విషయాలతో ఘర్షణ చెలరేగిందని, పార్టీకి ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. ఘటనకు బాధ్యులైనవారిపై తగిన చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించింది.

అయితే.. ఈ రెండు వర్గాలు వివిధ అవినీతి కార్యకలాపాలు సాగిస్తున్నాయని భాజపా ఎమ్మెల్యే అనుప్​ సాహా ఆరోపించారు.

ఇదీ చదవండి:బ్లేడ్​తో విద్యార్థిని గొంతు కోసి.. ఆస్పత్రి వరకు వెంబడించి..

live murder video viral: వ్యాపారి దారుణ హత్య.. తుపాకులతో ఒక్కసారిగా..

Last Updated :Nov 23, 2021, 9:46 PM IST

ABOUT THE AUTHOR

...view details